యాప్నగరం

కపిల్.. ధోనీ సరసన మిథాలీ నిలిచేనా..?

ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. ఇప్పటికే ప్రపంచకప్‌లు అందించిన మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనీ సరసన

TNN 22 Jul 2017, 5:55 pm
క్రికెట్‌ని ఒక మతంగా భావించే భారత్ మరో ప్రపంచకప్‌ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా భారత్ జట్టు ఆదివారం ఫైనల్లో ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. ఇప్పటికే ప్రపంచకప్‌లు అందించిన మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనీ సరసన కెప్టెన్ మిథాలీ రాజ్ నిలవనుంది. టోర్నీ ఆరంభం నుంచి అంచనాలను అందుకుంటూ జోరు కొనసాగించిన భారత్.. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై స్ఫూర్తిదాయక విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఫైన‌ల్‌కి సిద్ధమైంది.
Samayam Telugu icc womens world cup 2017 final
కపిల్.. ధోనీ సరసన మిథాలీ నిలిచేనా..?


ఈ ఫైనల్లో భారత్‌ని ముందుండి నడిపించనున్న కెప్టెన్ మిథాలీ రాజ్.. ఎనిమిదేళ్ల క్రితమే క్రికెట్‌కి వీడ్కోలు చెప్పాలని భావించిందట. ‘సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. వాస్తవంగా చెప్పాలంటే.. మహిళా క్రికెటర్లకి ఆదరణ లేకపోవడంతో 2009 ప్రపంచకప్‌ తర్వాత క్రికెట్‌కి వీడ్కోలు చెప్పాలని అనుకున్నా. కానీ.. ఆ ప్రపంచకప్‌‌తోనే అందరూ మహిళల క్రికెట్ చూడటం ప్రారంభించారు. మ్యాచ్‌లు టీవీల్లో ప్రసారమయ్యాయి. అప్పటి నుంచి వీడ్కోలు ఆలోచన వచ్చినప్పుడల్లా నా తల్లిదండ్రులు పడిన కష్టం గుర్తుకు తెచ్చుకుని స్ఫూర్తి పొందుతున్నా’ అని మిథాలీ రాజ్ వివరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.