యాప్నగరం

​ ఫైనల్.. ఇంగ్లాండ్‌ని ఒత్తిడిలోకి నెట్టిన భారత్

33వ ఓవర్ బౌలింగ్‌కు వచ్చిన జులన్ గోస్వామి మ్యాచ్‌ని మలుపుతిప్పే ప్రదర్శన చేసింది. తొలుత టేలర్‌ని పెవిలియన్‌కి పంపిన జులన్..

TNN 23 Jul 2017, 5:41 pm
లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్ ఫైనల్లో వరుసగా వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్‌ని.. భారత్ జట్టు ఒత్తిడిలోకి నెట్టింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ 37.1 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులతో కొనసాగుతోంది. ఆదిలోనే 63/3తో ఇబ్బందుల్లో పడిన జట్టును టేలర్ (45: 62 బంతుల్లో)‌తో కలిసి నాటైల్ సైవర్ (51 : 68 బంతుల్లో 5x4) కీలక ఇన్నింగ్స్‌తో పోటీలోకి తెచ్చింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కి 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ శిబిరంలో ఆందోళన మొదలైంది.
Samayam Telugu icc womens world cup 2017 final at lords jhulan goswami takes 2 in 2
​ ఫైనల్.. ఇంగ్లాండ్‌ని ఒత్తిడిలోకి నెట్టిన భారత్


ఇంగ్లాండ్ జట్టు స్కోరు 146 వద్ద ఇన్నింగ్స్ 33వ ఓవర్ బౌలింగ్‌కు వచ్చిన జులన్ గోస్వామి మ్యాచ్‌ని మలుపుతిప్పే ప్రదర్శన చేసింది. తొలుత టేలర్‌ని పెవిలియన్‌కి పంపిన జులన్.. తర్వాత బంతికే విల్సన్‌ని (0) ఔట్ చేసి ఇంగ్లాండ్‌కి షాకిచ్చింది. అనంతరం కొద్దిసేపటికే .. అర్థ శతకం పూర్తి చేసుకుని జోరుమీద కనిపించిన నాటైల్ సైవర్‌ని కూడా వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ఆ జట్టు 37.1 ఓవర్లు ముగిసే సమయానికి 164/6తో ఒత్తిడిలో పడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.