యాప్నగరం

పాక్‌తో మ్యాచ్.. మహిళా క్రికెటర్లకి వార్నింగ్

వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో కొంతమంది చేసిన తప్పిదాలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. చేతిలో పడిన

TNN 1 Jul 2017, 5:12 pm
ఐసీసీ ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌కి ముందు భారత మహిళా క్రికెటర్లకి కెప్టెన్ మిథాలీ రాజ్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. టోర్నీలో భాగంగా ఇప్పటికే తలపడిన రెండు మ్యాచ్‌ల్లోనూ.. భారత్ విజయాలను అందుకున్నా ఫీల్డింగ్‌లో మెరుగ్గా రాణించలేకపోయింది. దీంతో ఆదివారం పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఫీల్డింగ్ తప్పిదాలు సరిదిద్దుకోవాల్సిందిగా క్రికెటర్లకి మిథాలీరాజ్ సూచించింది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టును 35 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 7 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది.
Samayam Telugu icc wwc17 mithali raj calls on team to improve fielding ahead of pakistan clash
పాక్‌తో మ్యాచ్.. మహిళా క్రికెటర్లకి వార్నింగ్


‘ప్రపంచకప్‌లో మేము సెమీస్‌కి చేరువవుతున్నాం. కాబట్టి ఈ సమయంలో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి ఫీల్డింగ్ తప్పిదాలను వీలైనంత త్వరగా సరిదిద్దుకోవాలి. ముఖ్యంగా క్యాచ్‌లు పట్టడం, రనౌట్లు చేయడం. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో కొంతమంది చేసిన తప్పిదాలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. చేతిలో పడిన రెండు క్యాచ్‌లని వదిలేశారు. సెమీస్‌కి ముందు పాకిస్థాన్, శ్రీలంకతో మేము తలపడాల్సి ఉంది. ప్రతి మ్యాచ్‌ ప్రపంచకప్‌లో కీలకమే’ అని మిథాలీరాజ్ వివరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.