యాప్నగరం

టీ20 వరల్డ్‌కప్‌ 2020 భవిషత్యం తేలేది రేపే..!

టీ20 వరల్డ్‌కప్‌ కోసం 16 క్రికెట్ జట్లని ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ దేశంలోకి ప్రస్తుత పరిస్థితుల్లో అనుమతించడం కష్టం. దానికి తోడు.. ఖాళీ స్టేడియాల్లో టోర్నీ నిర్వహిస్తే రూ. వందల కోట్లు ఐసీసీ నష్టపోనుంది.

Samayam Telugu 9 Jun 2020, 5:21 pm
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ భవితవ్యం బుధవారం తేలిపోనుంది. షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ టీ20 వరల్డ్‌కప్ జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం సెప్టెంబరు వరకూ పర్యాటక వీసాల్ని రద్దు చేసింది. దాంతో.. టోర్నీలో పోటీపడే 16 జట్లూ.. వరల్డ్‌కప్ ఆరంభ తేదీకి ముందు అక్కడి చేరుకోవడంపై సందేహాలు నెలకొన్నాయి. ఇతర దేశాల నుంచి వచ్చే వారు కనీసం 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని అన్ని దేశాల ప్రభుత్వాలు ఆదేశిస్తున్న విషయం తెలిసిందే.
Samayam Telugu T2O WORLD CUP


ఆస్ట్రేలియా ప్రభుత్వం వీసా నిబంధనల్ని సడలించేందుకు నిరాకరించడంతో టీ20 వరల్డ్‌కప్‌‌ని నిర్వహించలేమని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇప్పటికే ప్రాథమికంగా తేల్చి చెప్పేసింది. దాంతో.. టోర్నీని వాయిదా వేయడం మినహా మరో ప్రత్యామ్నాయ మార్గం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ముందు లేకపోయింది. ఒకవేళ టీ20 వరల్డ్‌కప్‌ని వాయిదా వేస్తే..? ఆ అక్టోబరు - నవంబరు విండోలో ఐపీఎల్‌ 2020 సీజన్‌ని నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది.

టీ20 వరల్డ్‌కప్ వాయిదాపై ఐసీసీ బుధవారం తుది నిర్ణయం ప్రకటించబోతోంది. ఈ మేరకు రేపు ఐసీసీ.. క్రికెట్ కమిటీ మీటింగ్‌ షెడ్యూల్, ఎజెండాలని కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్‌కప్ వాయిదాతో పాటు.. ఐసీసీ ఛైర్మన్ ఎన్నికల గురించి కూడా మీటింగ్‌లో కమిటీ సభ్యులు చర్చించనున్నారు. ఇప్పటి వరకూ ఛైర్మన్‌గా ఉన్న శశాంక్ మనోహర్.. మరో పర్యాయం పోటీ చేసేందుకు నిరాకరించగా.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రేసులో ముందున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.