యాప్నగరం

భారత క్రికెటర్లకి రెండు నిమిషాలే..!

దక్షిణాఫ్రికాతో కఠిన సిరీస్‌కి సిద్ధమవుతున్న భారత జట్టు క్రికెటర్లకి ఊహించని సమస్య ఎదురైంది. కేప్ టౌన్ వేదికగా శుక్రవారం నుంచి భారత్,

TNN 4 Jan 2018, 5:02 pm
దక్షిణాఫ్రికాతో కఠిన సిరీస్‌కి సిద్ధమవుతున్న భారత జట్టు క్రికెటర్లకి ఊహించని సమస్య ఎదురైంది. కేప్ టౌన్ వేదికగా శుక్రవారం నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ప్రారంభంకానుండగా.. ఆటగాళ్లు గత నాలుగు రోజుల నుంచి తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే.. ప్రాక్టీస్ అనంతరం హోటల్‌కి వెళ్తున్న క్రికెటర్లు.. రెండు నిమిషాల్లోనే స్నానం ముగించుకుని బాత్రూమ్‌ నుంచి వెలుపలకి వస్తున్నారట. ఇదేదో క్రమశిక్షణ పేరుతో ప్రధాన కోచ్ రవిశాస్త్రి రూల్ పెట్టలేదు.. నీటి సమస్య కారణంగా దక్షిణాఫ్రికా స్థానిక అధికారులు ఆటగాళ్లకి ఈ నిబంధన పెట్టారట.
Samayam Telugu in dry cape town indian cricket team told not more than two minutes in shower
భారత క్రికెటర్లకి రెండు నిమిషాలే..!


కేప్ టౌన్ పరిసరాల్లో కరవు కారణంగా స్టేడియంలోని పిచ్‌ను కూడా పూర్తిస్థాయిలో తడపలేకపోతున్నట్లు క్యూరేటర్ ఇటీవల ఆవేదన వ్యక్తం చేశాడు. భారత జట్టు ప్రాక్టీస్‌కి పచ్చికతో కూడిన పిచ్‌ను అడగ్గా.. జీవం లేని పిచ్‌ని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కేటాయించడంలో అంతర్లీన కారణం నీటి సమస్యేనని తెలుస్తోంది. సుమారు మూడు సెషన్స్‌లో కఠినంగా ఎండ‌లో ప్రాక్టీస్ చేస్తున్న భారత క్రికెటర్లకి.. కనీసం కాసేపు కూడా షవర్‌ కింద సేదదీరే ఛాన్స్ లేకపోవడం శోచనీయం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.