యాప్నగరం

కోహ్లీ, ధోనీ లేని టీమ్‌ టీ20ల్లో మెరిసేనా..?

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన భారత సెలక్టర్లు అతని స్థానంలో రోహిత్ శర్మకి జట్టు పగ్గాలు అప్పగించారు.

Samayam Telugu 3 Nov 2018, 3:47 pm
వెస్టిండీస్‌పై 2-0తో టెస్టుల్లో గెలిచిన భారత్ జట్టు.. ఐదు వన్డేల సిరీస్‌ని కూడా 3-1తో అలవోకగా చేజిక్కించుకుంది. కానీ.. ఆదివారం నుంచి జరగబోతున్న మూడు టీ20ల సిరీస్‌లో మాత్రం కరీబియన్ టీమ్‌ని ఓడించడం టీమిండియాకు అంత సులువు కాదు. గత రెండేళ్లుగా వన్డే, టెస్టుల్లో విఫలమవుతున్న ఆ జట్టు టీ20ల్లో మాత్రం తిరుగులేని ప్రదర్శన కనబరుస్తోంది. తాజాగా కార్లోస్ బ్రాత్‌వైట్, డారెన్ బ్రావో, కీరన్ పొలార్డ్, ఆండ్రీ రసెల్ లాంటి భీకర హిట్టర్లు టీ20 జట్టులోకి రావడంతో ఆ జట్టు బలంగా కనిపిస్తోంది. మరోవైపు ధోనీ, కోహ్లీ లేకపోవడంతో టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ బలహీనంగా తయారైంది. ఈడెన్‌గార్డెన్స్ వేదికగా ఆదివారం రాత్రి తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.
Samayam Telugu Visakhapatnam: Indian batsmen Virat Kohli and MS Dhoni celebrate after the forme...
Indian batsmen Virat Kohli and MS Dhoni celebrate after the former completed his complete 10,000 ODI runs during the 2nd ODI cricket match against West Indies in Visakhapatnam.Photo/Swapan Mahapatra)


వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన భారత సెలక్టర్లు అతని స్థానంలో రోహిత్ శర్మకి జట్టు పగ్గాలు అప్పగించారు. అలానే ధోనీపై వేటు వేసి జట్టు కీపింగ్ బాధ్యతల్ని రిషబ్ పంత్‌కి ఇచ్చారు. దీంతో.. ఇద్దరు అగ్రశ్రేణి ఆటగాళ్లు సిరీస్‌కి దూరమవగా.. భారత్ జట్టు సిరీస్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందోనని..? సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మూడు టీ20ల సిరీస్‌ కోసం సెలక్టర్లు ఎంపిక చేసిన భారత్ జట్టుని ఓసారి పరిశీలిస్తే..! రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్య‌, వాషింగ్టన్ సుందర్, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, నదీమ్

ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు వస్తే.. మిడిలార్డర్‌లో కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్‌కి ఛాన్స్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత ఆల్‌రౌండర్ కోటాలో కృనాల్ పాండ్య‌, స్పిన్నర్లుగా కుల్దీప్, చాహల్ బరిలోకి దిగొచ్చు. ఒకవేళ కృనాల్‌కి ఛాన్స్ దక్కకపోతే.. వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలంటే మాత్రం భువీ, బుమ్రాతో పాటు ఖలీల్‌ తుది జట్టులోకి ఎంపిక కావొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.