యాప్నగరం

ప్రపంచకప్‌‌: ఇంగ్లాండ్‌కి 281తో భారత్ సవాల్

మ్యాచ్ ఆరంభం నుంచి ఇంగ్లాండ్ బౌలర్లని సమర్థంగా ఎదుర్కొన్న ఓపెనర్లు మందన, పూనమ్‌ తొలి వికెట్‌కి ఏకంగా 26.5

TNN 24 Jun 2017, 6:33 pm
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భారత్ జట్టు బ్యాట్స్‌వుమెన్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నారు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌‌లో స్మృతి మందన (90: 72 బంతుల్లో 11x4, 2x6), పూనమ్ రౌత్ (86: 134 బంతుల్లో 7x4, 1x6), కెప్టెన్ మిథాలీ రాజ్(71 : 73 బంతుల్లో 8x4) అర్ధ శతకాలు నమోదు చేయడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది.
Samayam Telugu ind to 281 for 3 against eng
ప్రపంచకప్‌‌: ఇంగ్లాండ్‌కి 281తో భారత్ సవాల్


మ్యాచ్ ఆరంభం నుంచి ఇంగ్లాండ్ బౌలర్లని సమర్థంగా ఎదుర్కొన్న ఓపెనర్లు మందన, పూనమ్‌ తొలి వికెట్‌కి ఏకంగా 26.5 ఓవర్లలో 144 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌కి శుభారంభమిచ్చారు. పూనమ్ నెమ్మదిగా ఆడినా.. స్మృతి మాత్రం వరుస బౌండరీలతో సత్తా చాటింది. ముఖ్యంగా ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన బ్రంట్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టేసింది.

శతకంవైపు వేగంగా దూసుకెళ్తున్న మందనని బౌలర్ నైట్ పెవిలియన్‌కి పంపగా.. అనంతరం వచ్చిన కెప్టెన్ మిథాలీతో కలిసి పూనమ్ జట్టు ఇన్నింగ్స్‌ని నడిపించింది. వీరిద్దరూ రెండో వికెట్‌కి 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్లో దూకుడు పెంచిన పూనమ్‌ని హజేల్‌ ఔట్ చేయగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ (24 నాటౌట్: 22 బంతుల్లో 1x4, 1x6) దూకుడుగా ఆడటంతో భారత్ మెరుగైన స్కోరు చేయగలిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.