యాప్నగరం

అఫ్గాన్‌పై టెస్టులో భారత్ 474కి ఆలౌట్

బెంగళూరు వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకి ఆలౌటైంది. ఓపెనర్లు శిఖర్ ధావన్

Samayam Telugu 15 Jun 2018, 12:03 pm
బెంగళూరు వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకి ఆలౌటైంది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (107: 96 బంతుల్లో 19x4, 3x6), మురళీ విజయ్ (105: 153 బంతుల్లో 15x4, 1x6) శతకాలతో మెరవగా.. హార్దిక్ పాండ్య (71: 94 బంతుల్లో 10x4), కేఎల్ రాహుల్ (54: 64 బంతుల్లో 8x4) సమయోచిత అర్ధశతకాలతో రాణించారు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో యామిన్ అహ్మదజాయ్ (3/51) ఫర్వాలేదనిపించగా.. రషీద్ ఖాన్ (2/154), వాఫదర్ (2/100), ముజీబ్ (1/75) అంచనాల మేర ఆకట్టుకోలేకపోయారు.
Samayam Telugu 0


ఓవర్‌నైట్ స్కోరు 347/6తో శుక్రవారం రెండో రోజు ఆటని కొనసాగించిన భారత జట్టు ఆరంభంలోనే అశ్విన్ (18) వికెట్ చేజార్చుకుంది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా (20)తో కలిసి కాసేపు దూకుడుగా ఆడిన హార్దిక్ పాండ్య స్కోరుని 400 దాటించాడు. అనంతరం జట్టు స్కోరు 436 వద్ద జడేజా ఔటవగా.. అర్ధ శతకం తర్వాత వేగం పెంచిన హార్దిక్ 440 పరుగుల వద్ద పెవిలియన్ బాట పట్టాడు. కానీ.. ఆఖర్లో వచ్చిన ఉమేశ్ యాదవ్ (26 నాటౌట్: 21 బంతుల్లో 2x4, 2x6) బ్యాట్ ఝళిపించడంతో భారత్ 474 పరుగులు చేయగలిగింది.

భారత్ vs అఫ్గానిస్థాన్ మధ్య టెస్టు మ్యాచ్‌ స్కోరు బోర్డు కోసం క్లిక్ చేయండి..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.