యాప్నగరం

అడిలైడ్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా..!

అడిలైడ్‌లో ఇప్పటి వరకు మూడు టెస్టులాడిన కోహ్లి 98.50 సగటుతో ఏకంగా 394 పరుగులు చేశాడు. ఇందులో 116, 169, 141 రూపంలో మూడు శతకాలు కూడా ఉండటం విశేషం

Samayam Telugu 2 Dec 2018, 4:46 pm
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మ్యాచ్ ఆడేందుకు భారత్ జట్టు ఈరోజు అడిలైడ్‌కి చేరుకుంది. సిడ్నీ వేదికగా గత ఆదివారం ఆఖరి టీ20 మ్యాచ్ ఆడిన టీమిండియా.. క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ టీమ్‌తో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ ఆడేందుకు శనివారం వరకూ అక్కడే ఉండిపోయింది. ఆ ప్రాక్టీస్ మ్యాచ్ నిన్న డ్రాగా ముగియగా.. ఈరోజు అక్కడ నుంచి బయల్దేరి అడిలైడ్‌కి చేరుకుంది. గురువారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు‌ మొదలవనుండగా.. యువ ఓపెనర్ పృథ్వీ షా గాయం కారణంగా ఈ టెస్టుకి దూరమయ్యాడు.
Samayam Telugu DtY90fCWsAIGQ2x


పేసర్లకి ఎక్కువగా అనుకూలించే అడిలైడ్‌‌ స్టేడియంలో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు అక్కడ మూడు టెస్టులాడిన కోహ్లి 98.50 సగటుతో ఏకంగా 394 పరుగులు చేశాడు. ఇందులో 116, 169, 141 రూపంలో మూడు శతకాలు ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో.. మరోసారి అడిలైడ్‌లో కోహ్లీ చెలరేగాలని టీమిండియా ఆశిస్తోంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య మొత్తం నాలుగు టెస్టులు జరగనుండగా.. రెండో టెస్టు పెర్త్ వేదికగా ఈనెల 14 నుంచి మొదలవనుంది.

భారత్ టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, లోకేశ్ రాహుల్, పృథ్వీ షా, చతేశ్వర్ పుజారా, ఆజింక్య రహానె, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పార్థివ్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.