యాప్నగరం

భారత్‌తో వన్డే సిరీస్‌కి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

భారత్‌ గడ్డపైకి వచ్చే ఏడాది జనవరిలో వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా టీమ్ రాబోతోంది. మూడు వన్డేల ఆ సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ఈరోజు జట్టుని ప్రకటించగా.. మాక్స్‌వెల్‌కి రెస్ట్ ఇచ్చారు.

Samayam Telugu 17 Dec 2019, 11:52 am
భారత్‌తో వచ్చే ఏడాది జనవరి 14 నుంచి జరగనున్న మూడు వన్డేల సిరీస్‌ కోసం 14 మందితో కూడిన ఆస్ట్రేలియా జట్టుని ఆ దేశ క్రికెట్ బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మంగళవారం ప్రకటించింది. హిట్టర్ మాక్స్‌వెల్, ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, నాథన్ లయన్, కౌల్టర్ నైల్‌ తదితర క్రికెటర్లని పక్కన పెట్టిన సీఏ.. ఇటీవల టెస్టుల్లో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడిన మార్కస్ లబుషేన్‌కి అనూహ్యంగా వన్డే టీమ్‌లో చోటిచ్చింది.
Samayam Telugu Australia ODI Squad vs India


Read also: MS Dhoni రీఎంట్రీపై మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆస్ట్రేలియా వన్డే జట్టు: అరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్‌స్మిత్, మిచెల్ స్టార్క్, అస్టన్ టర్నర్, ఆడమ్ జంపా, సీన్ అబాట్, అస్గన్ అగర్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్), పీటర్ హ్యాండ్స్‌కబ్, జోష్ హేజిల్‌వుడ్, మార్కస్ లబుషేన్, కేన్ రిచర్డ్‌సన్

తొలి వన్డే మ్యాచ్‌ ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జనవరి 14న జరగనుండగా.. ఆ తర్వాత 17న రాజ్‌కోట్ వేదికగా రెండో వన్డే, 19న బెంగళూరు వేదికగా మూడో వన్డే జరగనుంది. గాయం కారణంగా జేసన్ బెరండ్రాఫ్‌ టీమ్‌కి దూరమవగా.. టెస్టు కెప్టెన్‌గా ఉన్న అలెక్స్ క్యారీ వన్డేల్లో వికెట్‌ కీపర్‌గా ఎంపికయ్యాడు.

Read also: వెస్టిండీస్‌ టీమ్‌కి భారీ జరిమానా.. చెపాక్ వన్డేలో తప్పిదం

బిజీ షెడ్యూల్ కారణంగా తనకి విశ్రాంతి కావాలని హిట్టర్ మాక్స్‌వెల్ ముందుగానే బోర్డుని కోరగా.. షాన్ మార్ష్, నాథన్ లయన్, స్టాయినిస్‌ని పేలవ ఫామ్‌ కారణంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. భారత్ జట్టు ప్రస్తుతం వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఆడుతుండగా.. బుధవారం విశాఖపట్నం వేదికగా రెండో వన్డే జరగనుంది. ఇక ఆదివారం కటక్ వన్డేతో ఈ సిరీస్ ముగియనుంది.

Read Also: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.