యాప్నగరం

స్టేడియంలో Miss You Dhoni బ్యానర్.. కోహ్లీ రియాక్షన్ ఇది

ధోనీ కెప్టెన్సీలో భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత అతని నుంచి కెప్టెన్సీ పగ్గాలు కూడా అందుకున్నాడు. ఇప్పటికీ.. తన కెప్టెన్ ధోనీనేనని కోహ్లీ గౌరవవంగా చెప్తూ ఉంటాడు.

Samayam Telugu 7 Dec 2020, 8:25 pm
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై మరోసారి కెప్టెన్ విరాట్ కోహ్లీ తన గౌరవాన్ని చాటుకున్నాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా.. స్టేడియంలోని గ్యాలరీలో Miss You Dhoni అంటూ భారత అభిమానులు ఓ బ్యానర్‌ని ప్రదర్శించారు. దాంతో.. కోహ్లీ కూడా ‘మీ టూ’ అనే తరహాలో రియాక్షన్ ఇవ్వడంతో.. అభిమానులు కేరింతలతో కాసేపు స్టేడియాన్ని హోరెత్తించారు.
Samayam Telugu Virat Kohli (Image Credits: Twitter)



అంతర్జాతీయ క్రికెట్‌కి ఈ ఏడాది ఆగస్టులో మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. అతని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. రెండో టీ20లో శిఖర్ ధావన్ స్టంపౌట్‌ని చేజార్చిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వెడ్.. తాను ధోనీ అంత వేగంగా స్టంపౌట్ చేయలేకపోయానని బాహాటంగానే అంగీకరించాడు. అలానే ఇటీవల జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌కి స్లాగ్ ఓవర్లలో గౌరవప్రదమైన స్కోరుని అందించిన రవీంద్ర జడేజా.. ధోనీ ఒకప్పుడు చెప్పిన సలహాతోనే అది సాధ్యమైందని ఒప్పుకున్నాడు.


ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌ని ఇప్పటికే 2-0తో చేజిక్కించుకున్న టీమిండియా.. నామమాత్రమైన మూడో టీ20ని సిడ్నీ వేదికగా మంగళవారం ఆడనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.