యాప్నగరం

విమర్శలకి తలొగ్గని కోహ్లి.. టీమ్‌లో మార్పుల్లేవ్

తొలి టీ20లో 4 ఓవర్లు వేసిన కృనాల్ పాండ్య ఏకంగా 55 పరుగులు సమర్పించుకోగా.. బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ పేలవ ఆటతీరుతో నిరాశపరిచాడు.

Samayam Telugu 23 Nov 2018, 2:15 pm
ఆస్ట్రేలియా గడ్డపై తొలి టీ20లోనే భారత్ జట్టు ఓడిపోవడంతో తుది జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు, అభిమానులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. తొలి టీ20లో 4 ఓవర్లు వేసిన కృనాల్ పాండ్య ఏకంగా 55 పరుగులు సమర్పించుకోగా.. బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ పేలవ ఆటతీరుతో నిరాశపరిచాడు. దీంతో.. వారిని జట్టు నుంచి తప్పించి చాహల్, మనీశ్ పాండేకి చోటివ్వాలని సూచించారు. దీంతో.. మెల్‌బోర్న్ వేదికగా ఈరోజు జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌‌కి భారత్ తుది జట్టులో కోహ్లి మార్పులు చేస్తాడని అంతా భావించారు. కానీ.. విమర్శలకి తలొగ్గని కోహ్లి.. తొలి టీ20 జట్టునే రెండో టీ20కీ కొనసాగించాడు.
Samayam Telugu DshA1ypUUAAVRkk


ఆస్ట్రేలియాతో భారత్ జట్టు వరుసగా మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేల సుదీర్ఘ సిరీస్‌ని ఆడనుంది. ఈ నేపథ్యంలో.. కేవలం ఒక మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రానా.. ఆటగాళ్లపై వేటు వస్తే..? వారికి మానసిక స్థైర్యం దెబ్బతింటుందని కోహ్లీ భావించినట్లున్నాడు.

భారత్ తుది జట్టు ఇదే: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.