యాప్నగరం

విరాట్ కోహ్లీ ఇష్టాన్ని ప్రశ్నించే హక్కు ఎవరిచ్చారు..?: ఓజా ఆగ్రహం

ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులో టీమిండియా అవమానకరరీతిలో ఓడిపోయింది. ఇక మెల్‌బోర్న్ వేదికగా శనివారం నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. విరాట్ కోహ్లీ మాత్రం స్వదేశానికి వచ్చేస్తున్నాడు.

Samayam Telugu 22 Dec 2020, 7:46 am
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పర్సనల్ లైఫ్ డిసెషన్ గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని భారత మాజీ క్రికెటర్ ప్రగ్యాన్ ఓజా స్పష్టం చేశాడు. కోహ్లీ భార్య అనుష్క శర్మ వచ్చే ఏడాది జనవరి ఆరంభంలో బిడ్డకి జన్మనివ్వబోతుండటంతో.. ఆస్ట్రేలియా పర్యటన నుంచి మధ్యలోనే భారత్‌కి విరాట్ కోహ్లీ వచ్చేస్తున్నాడు. దాంతో.. కొంత మంది అభిమానులు.. విరాట్ కోహ్లీని ట్రోల్ చేస్తూ.. తొలి టెస్టు ఓటమితో అతను బెదిరిపోయి స్వదేశానికి వచ్చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. డిసెంబరు 26 నుంచి మెల్‌బోర్న్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుండగా.. అడిలైడ్‌లో గత శనివారం ముగిసిన తొలి టెస్టులో భారత్ అవమానకరరీతిలో 36 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.
Samayam Telugu Virat Kohli Paternity Leave (Image Credit: Reuters)


‘‘విరాట్ కోహ్లీ పర్సనల్ లైఫ్‌ గురించి ఓ నిర్ణయాన్ని తీసుకున్నాడు. దాన్ని మనం గౌరవించాలి. ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లక ముందే చాలా క్లియర్‌గా.. తొలి టెస్టు తర్వాత పర్యనట నుంచి తాను వైదొలగనున్నట్లు విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. అది అతనిష్టం. అనుష్క శర్మకి ప్రసవ సమయంలో కోహ్లీ సపోర్ట్ కావాలి. ఇదే విషయాన్ని బీసీసీఐకి కూడా ముందే కోహ్లీ తెలియజేశాడు. మరి సిరీస్ మధ్యలో ఎలా వెళ్లిపోతాడు..? అది కూడా తొలి టెస్టులో ఓటమి తర్వాత.. అని ఇప్పుడు కొందరు ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. నిజమే.. తొలి టెస్టు ఓటమి అందర్నీ బాధించింది. అంతమాత్రానా.. ఇప్పుడు కోహ్లీ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు మనకు లేదు’’ అని ఓజా స్పష్టం చేశాడు.

మెల్‌బోర్న్ వేదికగా శనివారం నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుండగా.. విరాట్ కోహ్లీ స్థానంలో కేఎల్ రాహుల్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక కెప్టెన్‌గా అజింక్య రహానె మిగిలిన మూడు టెస్టుల్లోనూ భారత్ జట్టుని నడిపించనున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.