యాప్నగరం

Tim Paine: పెర్త్‌లో మళ్లీ గొడవపడిన కోహ్లీ, టిమ్‌పైన్..!

విరాట్ కోహ్లీ, టిమ్‌పైన్‌ ఒకరినొకరు కవ్వించే తరహాలో ఢీకొనేందుకు ప్రయత్నించడంతో ఫీల్డ్ అంపైర్ ఆఖరికి కలగజేసుకోవాల్సి వచ్చింది.

Samayam Telugu 17 Dec 2018, 1:33 pm
భారత్, ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌ ఆటగాళ్ల కవ్వింపులతో రసవత్తరంగా మారిపోయింది. ముఖ్యంగా.. భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్‌పైన్ మధ్య మాటల యుద్ధం వరుసగా రెండో రోజూ కూడా కొనసాగింది. నిన్న ఆఖరి సెషన్‌లో బ్యాటింగ్ చేస్తున్న టిమ్‌పైన్.. అతిగా డిఫెన్స్ చేస్తుండంతో.. ఇలా అయితే.. భారత్ 2-0తో గెలుస్తుందని కోహ్లీ కవ్వించగా.. మీ వరకూ బ్యాటింగ్‌ వస్తే కదా..? అంటూ టిమ్‌పైన్ బదులివ్వడం స్టంప్‌ మైక్‌లో స్పష్టంగా రికార్డైంది. ఈరోజు మళ్లీ ఈజోడీ మైదానంలో కాలు దువ్వుకుంది.
Samayam Telugu 1545025659-kohli-paine_0


ఆటలో నాలుగోరోజైన సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 132/4తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు 174/4తో నిలిచిన దశలో.. పరుగు కోసం నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు వచ్చిన టిమ్‌పైన్.. కోహ్లీని దాదాపు ఢీకొట్టేలా కనిపించాడు. అతని ప్రయత్నాన్ని ముందే పసిగట్టిన కోహ్లీ కదలకుండా అలానే నిల్చోగా.. టిమ్‌పైన్ కూడా అతనికి చాలా దగ్గరగా వెళ్లిపోయాడు. ఇద్దరు ఆటగాళ్లు అలా ఒకరినొకరు కవ్వించే తరహాలో తాకేలా ప్రయత్నించడంతో ఫీల్డ్ అంపైర్ ఆఖరికి కలగజేసుకోవాల్సి వచ్చింది. అంపైర్‌కి వివరణ ఇచ్చే సమయంలోనూ కోహ్లీ కోపంగానే కనిపించాడు. నిన్న ఆట ముగిసిన తర్వాత పెవిలియన్‌కి వెళ్తున్న సమయంలోనూ ఈ ఇద్దరు క్రికెటర్లు మాటల యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.