ఆస్ట్రేలియాతో కాన్బెర్రా వేదికగా బుధవారం జరగనున్న మూడో వన్డేలో టీమిండియా బౌలర్లు తప్పకుండా పుంజుకుంటారని మిడిలార్డర్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్ ధీమా వ్యక్తం చేశాడు. సిడ్నీ వేదికగా ఇటీవల ముగిసిన రెండు వన్డేల్లోనూ తేలిపోయిన భారత బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చేశారు. దాంతో.. బ్యాట్స్మెన్లు ఛేదనలో చివరి వరకూ పోరాడినా ఫలితం లేకపోయింది. మూడు వన్డేల సిరీస్ని ఆస్ట్రేలియా ఇప్పటికే 2-0తో చేజిక్కించుకోగా.. నామమాత్రమైన మూడో వన్డేలోనైనా టీమిండియా పుంజుకోవాలని భారత్ అభిమానులు ఆశిస్తున్నారు.
‘‘నిజాయతీగా చెప్పాలంటే.. టీమిండియా ప్రదర్శన గురించి బయట ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియదు. కానీ.. ఒక్కటి మాత్రం నిజం.. ఐపీఎల్ 2020 సీజన్లో ఆటగాళ్లు ఆడి.. నేరుగా ఇక్కడికి వచ్చారు. ఐపీఎల్లో 14 మ్యాచ్లు.. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి క్వారంటైన్లో ఉండటం తప్పకుండా మైండ్పై ప్రభావం చూపింది. ఇందులో బౌలర్లు అనే కాదు.. టీమ్ మొత్తంపై ఆ ప్రభావం ఉంది. మూడో వన్డేలో తప్పకుండా బౌలర్లు పుంజుకుని.. సత్తాచాటుతారు’’ అని శ్రేయాస్ అయ్యర్ వెల్లడించాడు.
మూడో వన్డే తర్వాత డిసెంబరు 4 నుంచి మూడు టీ20ల సిరీస్.. అనంతరం డిసెంబరు 17 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలర్లు వీలైనంత త్వరగా లయ అందుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.
‘‘నిజాయతీగా చెప్పాలంటే.. టీమిండియా ప్రదర్శన గురించి బయట ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియదు. కానీ.. ఒక్కటి మాత్రం నిజం.. ఐపీఎల్ 2020 సీజన్లో ఆటగాళ్లు ఆడి.. నేరుగా ఇక్కడికి వచ్చారు. ఐపీఎల్లో 14 మ్యాచ్లు.. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి క్వారంటైన్లో ఉండటం తప్పకుండా మైండ్పై ప్రభావం చూపింది. ఇందులో బౌలర్లు అనే కాదు.. టీమ్ మొత్తంపై ఆ ప్రభావం ఉంది. మూడో వన్డేలో తప్పకుండా బౌలర్లు పుంజుకుని.. సత్తాచాటుతారు’’ అని శ్రేయాస్ అయ్యర్ వెల్లడించాడు.
మూడో వన్డే తర్వాత డిసెంబరు 4 నుంచి మూడు టీ20ల సిరీస్.. అనంతరం డిసెంబరు 17 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలర్లు వీలైనంత త్వరగా లయ అందుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.