యాప్నగరం

Rohit Sharma: రోహిత్‌తో రాజకీయాలా..? బీసీసీఐపై ఫ్యాన్స్ ఆగ్రహం!

Border Gavaskar Tophy | బెంగళూరులోని ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్న రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడే అవకాశం లేదని తెలుస్తోంది.

Samayam Telugu 24 Nov 2020, 12:16 pm
ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మ వెళ్లే అవకాశం లేదనే వార్తలు వెలువడుతున్న వేళ.. క్రికెట్ ఫ్యాన్స్ బీసీసీఐ తీరుపై మండిపడుతున్నారు. గాయపడిన రోహిత్ శర్మను దుబాయ్ నుంచి ఇండియా పంపించిన బోర్డు.. గాయం బారిన పడిన సాహాను మాత్రం ఆస్ట్రేలియా ఎందుకు తీసుకెళ్లిందని ప్రశ్నిస్తున్నారు. బీసీసీఐ రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఓవైపు హిట్ మ్యాన్ ఫిట్‌గా ఉన్నానని చెబుతున్నా.. బోర్డు ఇలా ఎందుకు చేస్తోందని నిలదీస్తున్నారు. బీసీసీఐ రాజకీయాల్లో ఉంటే బీజేపీకి ఇబ్బందయ్యేదంటూ సెటైర్లు వేస్తున్నారు.
Samayam Telugu rohit-sharma


రోహిత్ గాయం విషయంలో బీసీసీఐ సరైన ప్రకటన ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. తాను ఫిట్‌గా ఉన్నానని హిట్ మ్యాన్ చెబితే.. దాదా ఒకలా, రవిశాస్త్రి మరోలా చెబుతున్నారని.. ఇప్పుడేమో ఆస్ట్రేలియా టూర్‌కు రోహిత్ వెళ్లే అవకాశం లేదంటున్నారని.. అసలు సమస్యేంటని ఓ నెటిజన్ ప్రశ్నించారు.
మరి కొందరు మాత్రం రోహిత్ ముంబై ఇండియన్స్‌కే ప్రాధాన్యం ఇచ్చాడని.. గాయపడిన సాహా బీసీసీఐ సూచన మేరకు మిగతా మ్యాచ్‌లకు దూరంగా ఉండి కోలుకోగా.. రోహిత్ మాత్రం ఐపీఎల్‌‌లో మ్యాచ్‌లు ఆడి గాయాన్ని పెద్దది చేసుకున్నాడంటున్నారు. బీసీసీఐ సలహాను పాటించి విశ్రాంతి తీసుకున్న సాహా కోలుకోగా.. రోహిత్ మాత్రం కోలుకోలేదంటున్నారు.
ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ బయల్దేరి వెళ్లకపోతే.. అతడికి బ్యాకప్‌‌గా శ్రేయస్ అయ్యర్‌ను టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసే యోచనలో బీసీసీఐ ఉందని సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.