యాప్నగరం

భారత్‌తో తొలి టీ20కి మాస్క్‌లతో బంగ్లా క్రికెటర్లు

ఢిల్లీలో కాలుష్యం కారణంగా 2017 శ్రీలంక క్రికెటర్లు టెస్టు మ్యాచ్ ఆడుతూ వాంతులు చేసుకున్నారు. తాజాగా మరోసారి ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయింది. దీంతో.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మాస్క్‌లు ధరించి ఆడాలని బంగ్లాదేశ్ టీమ్ నిర్ణయించుకుంది.

Samayam Telugu 3 Nov 2019, 6:06 pm
భారత్‌తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి 7 గంటలకి ప్రారంభంకానున్న తొలి టీ20‌కి బంగ్లాదేశ్ క్రికెటర్లు మాస్క్‌లు ధరించి మైదానంలోకి రానున్నారు. దీపావళి తర్వాత ఢిల్లీలో కాలుష్యం పతాక స్థాయికి చేరడంతో ఆటగాళ్లు అనారోగ్యంపాలయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో.. గత రెండు రోజులుగా మాస్క్‌లు ధరించి ప్రాక్టీస్ చేసిన బంగ్లాదేశ్ క్రికెటర్లు.. ఈరోజు మ్యాచ్‌లో కూడా మాస్క్‌లు ధరించి ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu New Delhi: Bangladeshi cricketer Soumya Sarkar, wearing a mask, throws the ball ...
Bangladeshi cricketer Soumya Sarkar


Read More: సమైరా తాకగానే పడిపోయిన శిఖర్ ధావన్
2017‌లో ఇలానే ఢిల్లీలో కాలుష్యం కారణంగా.. శ్రీలంక క్రికెటర్లు టెస్టు మ్యాచ్ ఆడుతూ మైదానంలోనే వాంతులు చేసుకున్నారు. దీంతో.. అప్పట్లో లంక ఆటగాళ్లు మాస్క్‌లు ధరించి ఆ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. తాజాగా అదే తరహాలో బంగ్లాదేశ్ క్రికెటర్లు కూడా ఈరోజు మాస్క్‌లు ధరించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత క్రికెటర్లు మాత్రం.. సాధారణంగానే మ్యాచ్ ఆడే అవకాశాలున్నట్లు సమాచారం. కాలుష్యంతో తమకేమీ ఇబ్బందిలేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి రెండు రోజుల క్రితమే భారత టీ20 జట్టు తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Read More: undefined
భారత టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, సంజుశాంసన్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, కృనాల్‌ పాండ్య, చాహల్, దీపక్ చాహర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, శివమ్ దూబే, శార్ధూల్ ఠాకూర్

బంగ్లాదేశ్ టీ20 జట్టు: మహ్మదుల్లా (కెప్టెన్), లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, నయీమ్ షేక్, ముష్ఫికర్ రహీమ్, ఎండీ మిథున్, అపిప్ హుస్సేన్, హుస్సేన్ సైకత్, అమినుల్ ఇస్లామ్, ఆర్పాత్ సన్నీ, తైజుల్ ఇస్లామ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, సైపుల్ ఇస్లామ్, అబు హైదర్, ఆల్ అమిన్ హుస్సేన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.