యాప్నగరం

రోహిత్ ‘ఓటమి’ భావోద్వేగం.. స్పీచ్‌తో గెలుపు

భారత్‌పై ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా టీ20 సిరీస్ గెలవని బంగ్లాదేశ్.. ఫస్ట్ టైమ్ గెలిచే సూచనలు కనిపించడంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఎమోషనల్ అయిపోయాడు. తన స్పీచ్‌తో జట్టులో ఉత్సాహం నింపి.. ఎట్టకేలకి భారత్‌కి పరాభవాన్ని తప్పించాడు.

Samayam Telugu 11 Nov 2019, 3:07 pm
బంగ్లాదేశ్‌తో నాగ్‌పూర్ వేదికగా ఆదివారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ భావోద్వేగానికి లోనయ్యాడు. మంచు కారణంగా భారత బౌలర్లకి బంతిపై పట్టు చిక్కకపోవడంతో తొలి 12 ఓవర్లలో బంగ్లాదేశ్‌ భారీగా పరుగులు రాబట్టగలిగింది.
Samayam Telugu Rohit Sharma
Photo credit: Screengrab from BCCI video


175 పరుగుల ఛేదనలో ఆ జట్టు 12 ఓవర్లు ముగిసే సమయానికి 106/2తో మెరుగైన స్థితిలో నిలవడంతో.. ఇక భారత్‌కి ఓటమి తప్పదని అంతా ఊహించారు. భారత్ శిబిరంలోనూ ఆ నిరుత్సాహం స్పష్టంగా కనబడింది. దీంతో.. టీమ్ కెప్టెన్‌గా ఆటగాళ్లలో మానసిక స్థైర్యం నింపే బాధ్యతని తీసుకున్న రోహిత్ శర్మ మైదానంలో ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు.

Read More: దీపక్ చాహర్ టీ20 హ్యాట్రిక్.. తప్పులో కాలేసిన బీసీసీఐ
రోహిత్ మాటల తర్వాత పుంజుకున్న టీమిండియా బౌలర్లు 7.2 ఓవర్లలోనే మిగిలిన 8 వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్‌ని కుప్పకూల్చారు. దీంతో.. రోహిత్ శర్మ ఆటగాళ్లతో ఏం చెప్పాడు..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 30 పరుగుల తేడాతో మూడో టీ20లో గెలుపొందిన టీమిండియా.. మూడు టీ20ల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకుంది.

Final T20‌లో ఖలీల్, మహ్మదుల్లా గొడవ.. చూస్తుండిపోయిన రోహిత్ శర్మ
మైదానంలో తాను ఇచ్చిన స్పీచ్‌పై రోహిత్ శర్మ మాట్లాడుతూ ‘బౌలర్లే భారత్ జట్టుని గెలిపించారు. మంచు కారణంగా బౌలింగ్ చేయడం వారికి కష్టంగా అనిపించింది. దాంతో.. ఒకానొక దశలో బంగ్లాదేశ్ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించేసేలా కనిపించింది. కానీ.. బౌలర్లు బాధ్యత తీసుకుని జట్టుని గెలిపించారు. మ్యాచ్ చేజారిపోతున్న సమయంలో ఆటగాళ్లతో నేను ఒక్కటే చెప్పాను. వారు ధరించిన జెర్సీని చూపించి.. దేశం కోసం మనం ఆడుతున్నాం గెలిచి తీరాల్సిందే అని చెప్పా. ఆ టైమ్‌లో నేను కేవలం వారి బాధ్యతని మాత్రమే గుర్తు చేశా’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు.

Read More: టీ20లో రోహిత్ శర్మ బద్దకం.. గాల్లోకి ఎగిరిన వికెట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.