యాప్నగరం

Rohit Sharma పవర్.. ‘ఒక్క మాట’తో బంగ్లా ఓటమి

మంచుతో బంతిపై పట్టు చిక్కకపోవడంతో భారత స్పిన్నర్లలో నిస్సహాయత.. అనుభవలేమితో పరుగులిచ్చేస్తున్న శివమ్ దూబేలో ఒక్కటే కంగారు. మరోవైపు మ్యాచ్‌ గెలిచేస్తున్నామనే ఆనందంలో బంగ్లాదేశ్. ఈ టైమ్ రోహిత్ శర్మ ఒక్క మాటతో రెండు ఓవర్లలోనే మ్యాచ్ భారత్‌ చేతుల్లోకి వచ్చేసింది.

Samayam Telugu 11 Nov 2019, 9:50 am
బంగ్లాదేశ్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో తన కెప్టెన్సీ సామర్థ్యంపై ఉన్న అనుమానాల్ని రోహిత్ శర్మ పటాపంచ్‌లు చేసేశాడు. నాగ్‌పూర్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన విజేత నిర్ణయాత్మక ఆఖరి టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టు ఓటమి దిశగా వెళ్తున్న సమయంలో.. తన స్పీచ్‌తో రోహిత్ శర్మ టీమ్‌లో మళ్లీ ఉత్సాహం నింపాడు. దీంతో.. కేవలం రెండు ఓవర్ల వ్యవధిలోనే మళ్లీ మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసింది. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కి నాలుగు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మ.. తన కెప్టెన్సీ అనుభవాన్ని పూర్తిగా ఆదివారం రాత్రి వినియోగించి ఫలితం రాబట్టాడు.
Samayam Telugu ind vs ban 3rd t20i stand in captain rohit sharmas pep talk motivated us says shreyas iyer
Rohit Sharma పవర్.. ‘ఒక్క మాట’తో బంగ్లా ఓటమి


IND vs BAN 3rd T20 Trolls: ధోనీ శిష్యుడు మళ్లీ ఫెయిల్.. ఇక చాలు సాగనంపండి

మ్యాచ్‌లో 175 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ జట్టు 12 ఓవర్లు ముగిసే సమయానికి 106/2తో తిరుగులేని స్థితిలో ఉంది. అప్పటికి క్రీజులో ఉన్న ఓపెనర్ మహ్మద్ నయిమ్ (81: 48 బంతుల్లో 10x4, 2x6) దూకుడుని ఎంజాయ్ చేస్తూ బంగ్లాదేశ్ ఆటగాళ్లు డగౌట్‌లో చాలా ఉత్సాహంగా కనిపించారు. మరోవైపు భారత్ శిబిరంలో మ్యాచ్ చేజారిపోతున్న కంగారు స్పష్టంగా కనబడింది. దీంతో.. జట్టులో ఉత్సాహం నింపేందుకు రోహిత్ శర్మ మైదానంలోనే టీమ్‌ని సమావేశపరిచాడు. ఆ సమయంలో రోహిత్ శర్మ మాట్లాడింది ఒకే ఒక్క మాటే.. అదేంటి అనేది ఇప్పటికీ రహస్యమే. కానీ.. ఆ తర్వాత మ్యాచ్‌ చూస్తుండగానే భారత్‌వైపు తిరిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ మాట తమలో ఉత్సాహం నింపింది అని శ్రేయాస్ అయ్యర్ వెల్లడించాడు.

Read More: టీ20లో రోహిత్ శర్మ బద్దకం.. గాల్లోకి ఎగిరిన వికెట్

13వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన చాహర్.. దూకుడు పెంచుతున్న మిథున్ (27) వికెట్ పడగొట్టగా.. 14వ ఓవర్‌లో ఆల్‌రౌండర్ శివమ్ దూబే ప్రమాదకర ముష్ఫికర్ రహీమ్‌ని గోల్డెన్ డక్‌గా ఔట్ చేశాడు. టీ20 కెరీర్‌లో దూబేకి ఇదే ఫస్ట్ వికెట్‌కాగా.. ఆ తర్వాత 16వ ఓవర్‌లోనూ అతను నయిమ్, ఆపిప్ హుస్సేన్ (0) వికెట్లను పడగొట్టాడు. దీంతో.. మ్యాచ్ పూర్తిగా భారత్‌వైపు మొగ్గింది. ఆఖర్లో దీపక్ చాహర్ 6/7 చెలరేగడంతో 19.2 ఓవర్లలోనే 144 పరుగులకి బంగ్లాదేశ్ కుప్పకూలిపోయింది. మొత్తంగా.. జట్టులో ఆత్మస్థైర్యం సన్నగిల్లినప్పుడు రోహిత్ శర్మ తన స్పీచ్‌తో మళ్లీ టీమ్‌ని మ్యాచ్‌లోకి తేగలిగాడు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలిచి.. సిరీస్ వారికి చేజిక్కింటే..? మైదానంలో వారి కవ్వింపు నాగిని డ్యాన్స్‌లు చూడాల్సి వచ్చేదేమో..!

undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.