యాప్నగరం

Delhi T20లో బంగ్లాదేశ్ క్రికెటర్లకి వాంతులు

ఢిల్లీ పొల్యూషన్‌కి బంగ్లాదేశ్ క్రికెటర్లు బాధితులుగా మిగిలారు. బ్యాటింగ్ చేస్తూ ఆ జట్టు బ్యాట్స్‌మెన్ సౌమ్య సర్కార్ మైదానంలోనే వాంతులు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Samayam Telugu 5 Nov 2019, 11:16 am
భారత్‌తో ఆదివారం ముగిసిన తొలి టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ బంగ్లాదేశ్ క్రికెటర్లు వాంతులు చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని బంగ్లాదేశ్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 154/3తో ఛేదించిన విషయం తెలిసిందే. అయితే.. ఢిల్లీలో పొల్యూషన్ కారణంగా ఇద్దరు బంగ్లాదేశ్ క్రికెటర్లు వాంతులు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Samayam Telugu New Delhi: Bangladeshs Mushfiqur Rahim, celebrates after wining first T20 crick...
..


Read More: టీ20లో 4, 4, 4, 4 ఖలీల్ అహ్మద్ ఇక సర్దుకో..!
దీపావళి తర్వాత ఢిల్లీలో కాలుష్యం పతాక స్థాయికి చేరింది. దీంతో.. గత ఆదివారం ఢిల్లీలో జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వేదిక మార్చాలని డిమాండ్స్ వినిపించాయి. కానీ.. బీసీసీఐ ససేమేరా అనడంతో.. ఇరు జట్ల ఆటగాళ్లు తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. కాలుష్యం, పొగ కారణంగా.. మ్యాచ్ ముందు వరకూ స్టేడియం పరిసరాలు దారుణంగా కనిపించాయి. దీంతో.. పెద్ద ఎత్తున నీటిని వినియోగించిన ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) మ్యాచ్ మొదలయ్యే సమయానికి పరిస్థితిని కొంచెం అదుపులోకి తెచ్చింది.

Read More: పేరుకేమో పవర్ హిట్టర్.. షాట్ మాత్రం..?
కాలుష్యం కారణంగా తొలి టీ20కి ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో మాస్క్‌లు ధరించిన బంగ్లాదేశ్ క్రికెటర్లు.. మ్యాచ్‌లో మాత్రం వాటిని ధరించలేదు. దీంతో.. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంగ్లాదేశ్ సీనియర్ బ్యాట్స్‌మెన్ సౌమ్య సర్కార్ మైదానంలోనే వాంతులు చేసుకున్నట్లు తెలుస్తోంది. అతనితో పాటు మరో క్రికెటర్ కూడా డ్రెస్సింగ్ రూములో వాంతులు చేసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. 2017లో ఢిల్లీలో టీమిండియాతో టెస్టు మ్యాచ్ ఆడిన శ్రీలంక క్రికెటర్లు కూడా పొల్యూషన్ కారణంగా మైదానంలోనే వాంతులు చేసుకున్న విషయం తెలిసిందే.

Read More: డీఆర్‌ఎస్‌పై పంత్‌‌ని నమ్మక తప్పలేదు: రోహిత్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.