యాప్నగరం

భారత్‌తో సిరీస్ ముంగిట.. ఇంగ్లాండ్‌ టీమ్‌కి 6 రోజుల క్వారంటైన్

శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడుతున్న ఇంగ్లాండ్ టీమ్ అక్కడి నుంచి ఈ నెల 27న భారత్ గడ్డపై అడుగుపెట్టనుంది. ఆ తర్వాత వారం రోజులు క్వారంటైన్‌లో ఉన్న జట్టు.. కేవలం మూడు రోజుల ప్రాక్టీస్‌తో సరిపెట్టుకోనుంది.

Samayam Telugu 25 Jan 2021, 1:14 pm
భారత్‌తో సుదీర్ఘ సిరీస్ ఆడేందుకు త్వరలో రానున్న ఇంగ్లాండ్ టీమ్‌ని ఆరు రోజులు క్వారంటైన్‌లో ఉంచాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. ఫిబ్రవరి 5 నుంచి నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ని టీమిండియాతో ఇంగ్లాండ్ ఆడనుండగా.. ఈ నెల 27న భారత్ గడ్డపై ఇంగ్లాండ్ టీమ్ అడుగుపెట్టనుంది. ఫిబ్రవరి 5 నుంచి చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. ఆరు రోజుల క్వారంటైన్ తర్వాత కేవలం మూడు రోజులు మాత్రమే ఇంగ్లాండ్ టీమ్‌కి ప్రాక్టీస్ చేసుకునే టైమ్ ఉంటుంది.
Samayam Telugu England cricket squad
File photo of the England cricket squad upon arrival in Colombo for the Test series against Sri Lanka (AFP Photo)


శ్రీలంక టూర్‌లో ఉన్న ఇంగ్లాండ్ టీమ్ ప్రస్తుతం అక్కడ రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ 26న ముగియనుండగా.. ఆ తర్వాత రోజు అక్కడి నుంచి భారత్‌కి ఇంగ్లాండ్ జట్టు రానుంది. అయితే.. లంక పర్యటనకి దూరంగా ఉన్న బెన్‌స్టోక్స్, జోప్రా ఆర్చర్, రోరీ బర్న్స్ మాత్రం ఆదివారం రాత్రే భారత్‌కి వచ్చేశారు. వారు ప్రస్తుతం ఆరు రోజుల క్వారంటైన్‌లో ఉన్నారు. శ్రీలంక గడ్డపై అడుగుపెట్టగానే ఇంగ్లాండ్ టీమ్ స్పిన్నర్ మొయిన్ అలీ కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే.

Read Also: undefined


వాస్తవానికి శ్రీలంక కేవలం 48 గంటలు మాత్రమే ఇంగ్లాండ్ ఆటగాళ్లని క్వారంటైన్‌లో ఉంచింది. ఆ తర్వాత ట్రైనింగ్‌కి అనుమతించింది. కానీ.. బీసీసీఐ మాత్రం సుదీర్ఘ సిరీస్ కావడంతో.. ఆరు రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ ఆరు రోజులు మూడు సార్లు ఇంగ్లాండ్ ఆటగాళ్లకి కరోనా వైరస్ పరీక్షల్ని నిర్వహించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.