యాప్నగరం

India Squad: ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌కి భారత్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రోహిత్

ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌ కోసం మూడు వేర్వేరు జట్లని భారత సెలెక్టర్లు ఎంపిక చేశారు. టెస్టు మ్యాచ్ ముగిసిన రెండు రోజుల్లోనే టీ20 మ్యాచ్ ఉండటంతో..?

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 1 Jul 2022, 8:16 am
ఇంగ్లాండ్‌తో ఈరోజు నుంచి ఐదో టెస్టు మ్యాచ్ ఆడనున్న భారత్ జట్టు.. 7 నుంచి వరుసగా మూడు టీ20లు, మూడు వన్డేలను ఆడనుంది. ఈ మేరకు టీ20, వన్డే సిరీస్ కోసం జట్టుని భారత సెలెక్టర్లు తాజాగా ప్రకటించారు. కరోనా వైరస్ కారణంగా టెస్టు మ్యాచ్‌కి దూరమైన రోహిత్ శర్మ (Rohit Sharma).. టీ20, వన్డే సిరీస్‌ సమయానికి ఫిట్‌నెస్ సాధిస్తాడని భావించిన సెలెక్టర్లు అతడ్ని కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
Samayam Telugu India Squad For T20I & ODI Series


టెస్టు మ్యాచ్ ముగిసిన రెండు రోజుల్లోనే టీ20 మ్యాచ్ ఉండటంతో.. విరాట్ కోహ్లీ (Virat Kohli), రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాని తొలి టీ20కి ఎంపిక చేయలేదు. రెండో టీ20 నుంచి వారు సిరీస్‌లో ఆడతారు. టీ20 మ్యాచ్‌లు ఈ నెల 7, 9, 10న జరగనుండగా.. వన్డేలు 12, 14, 17న నిర్వహించబోతున్నారు.

తొలి టీ20కి భారత్ జట్టు (India T20I Squad): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, వెంకటేశ్ అయ్యర్, యుజ్వేందర్ చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్

రెండు, మూడో టీ20కి భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, యుజ్వేందర్ చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్.

మూడు వన్డేల సిరీస్‌కి భారత్ జట్టు (India ODI Squad): రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శార్ధూల్ ఠాకూర్, యుజ్వేందర్ చాహల్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసీద్ కృష్ణ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.