India Test Squadలోకి మయాంక్కి పిలుపు.. 17 మందితో టీమ్ ఇదే
IND vs ENG 5th Testలో ఒకవేళ రోహిత్ శర్మ ఆడలేకపోతే? అతని స్థానంలో ఆడేందుకు ఓపెనర్ని భారత్ నుంచి సెలెక్టర్లు పంపించారు. దాంతో.. టీమిండియాకి ఒక సమస్య తీరిపోయింది.
ప్రధానాంశాలు:
- భారత్, ఇంగ్లాండ్ మధ్య జులై 1న టెస్టు మ్యాచ్
- కరోనా వైరస్ బారినపడిన కెప్టెన్ రోహిత్ శర్మ
- గాయంతో టూర్కి దూరమైపోయిన కేఎల్ రాహుల్
- మయాంక్ని ఇంగ్లాండ్కి పంపిన భారత సెలెక్టర్లు
ఇంగ్లాండ్ టూర్లో ఉన్న భారత టెస్టు జట్టుతో సీనియర్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ చేరబోతున్నాడు. వారం క్రితం ముంబయి నుంచి 15 మందితో కూడిన భారత టెస్టు జట్టు ప్రత్యేక విమానంలో లండన్కి వెళ్లింది. జులై 1 నుంచి ఇంగ్లాండ్తో బర్మింగ్హామ్ వేదికగా ఐదో టెస్టుని టీమిండియా ఆడబోతుండగా.. గత వారం లాసెస్టర్ టీమ్తో కలిసి నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ కూడా ఆడింది. కానీ.. ఈ మ్యాచ్లో ఆడుతూ కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారినపడ్డాడు. దాంతో.. ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్న హిట్మ్యాన్.. టెస్టు మ్యాచ్లో ఆడటంపై సందిగ్ధత నెలకొంది. రోహిత్ శర్మ ఊహించనిరీతిలో టెస్టు మ్యాచ్కి దూరమవడంతో.. టీమిండియా మేనేజ్మెంట్ పునరాలోచనలో పడింది. వాస్తవానికి ఇంగ్లాండ్తో టెస్టు మ్యాచ్కి తొలుత రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శుభమన్ గిల్ రూపంలో ముగ్గురు ఓపెనర్లని భారత సెలెక్టర్లు ఎంపిక చేశారు. కానీ.. టూర్ ఆరంభానికి ముందే గాయపడిన కేఎల్ రాహుల్ భారత్లోనే ఉండిపోయాడు. అయినప్పటికీ.. రోహిత్ శర్మ, గిల్ రూపంలో ఓపెనర్లు అందుబాటులో ఉండటంతో అతని స్థానంలో జట్టులోకి ఎవరినీ తీసుకోలేదు. కానీ.. తాజాగా రోహిత్ కూడా కరోనా కారణంగా టెస్టులో ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. దాంతో.. మయాంక్ అగర్వాల్ని జట్టులోకి ఎంపిక చేసిన భారత సెలెక్టర్లు.. ఇంగ్లాండ్కి పంపించారు. సిరీస్ బయో-సెక్యూర్ బబుల్లో జరగకపోవడంతో అక్కడికి వెళ్లగానే మయాంక్ నేరుగా జట్టుతో చేరిపోనున్నాడు. దాంతో.. టెస్టులోనూ అతను ఆడే అవకాశం ఉంది. రెండు వారాల క్రితం కరోనా బారినపడిన అశ్విన్ ఆలస్యంగా ఇంగ్లాండ్ టూర్కి వెళ్లిన విషయం తెలిసిందే.
ఇంగ్లాండ్తో ఐదో టెస్టుకి భారత జట్టు ఇదే: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (రిజర్వ్ వికెట్ కీపర్), శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసీద్ కృష్ణ.
ఇంగ్లాండ్తో ఐదో టెస్టుకి భారత జట్టు ఇదే: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (రిజర్వ్ వికెట్ కీపర్), శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసీద్ కృష్ణ.