ఫైనల్ వన్డేకి భారత్ జట్టులో మూడు మార్పులు సూచించిన వసీం జాఫర్
తొలి వన్డేలో 66 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో పేలవంగా ఓడిపోయింది. దాంతో.. విజేత నిర్ణయాత్మక చివరి వన్డేపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్ తుది జట్టులో మూడు మార్పులని
Samayam Telugu 27 Mar 2021, 6:43 pm
ప్రధానాంశాలు:
- భారత్, ఇంగ్లాండ్ మధ్య ఆదివారం ఫైనల్ వన్డే
- టీమిండియాలో మార్పుల్ని సూచించిన వసీం జాఫర్
- మూడు వన్డేల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమం
- రెండో వన్డేలో తేలిపోయిన స్పిన్నర్లు
భారత్, ఇంగ్లాండ్ మధ్య పుణె వేదికగా ఆదివారం విజేత నిర్ణయాత్మక వన్డే మ్యాచ్ జరగనుంది. మూడు వన్డేల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమవగా.. ఆదివారం వన్డేతో సిరీస్ విజేత ఎవరో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో.. భారత్ తుది జట్టులో మూడు మార్పులని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సూచించాడు. అదీ.. కెప్టెన్ విరాట్ కోహ్లీకి పరోక్షంగా ఓ ట్వీట్ ద్వారా జాఫర్ సూచించడం విశేషం. మధ్యాహ్న సమయంలో కొంత మంది చెస్ ఆడుతున్న ఫొటోని ట్వీట్ చేసిన వసీం జాఫర్ తుది జట్టులోకి ముగ్గురు ఆటగాళ్లని తీసుకోవాలని పరోక్షంగా కోహ్లీకి సూచించాడు. అతని ట్వీట్ని డీకోడ్ చేస్తే.. చెస్ అనగానే గుర్తొచ్చేది చాహల్. అతను చెస్లో స్టేట్ లెవల్ ఛాంపియన్. అలానే అతని ట్వీట్లో సన్ అని పేర్కొనడం ద్వారా సూర్యకుమార్ యాదవ్.. ఇక వాషింగ్టన్ అని స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ని తీసుకోమని సూచించినట్లు కనిపిస్తోంది. రెండో వన్డేలో స్పిన్ ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా వేసిన 6 ఓవర్లలోనే 72 పరుగులు సమర్పించుకోగా.. కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లలో 84 పరుగులిచ్చాడు. ఇద్దరూ కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. దాంతో.. ఈ ఇద్దరి స్థానాల్లో చాహల్, వాషింగ్టన్ సుందర్ని తీసుకోవాలని జాఫర్ సూచించినట్లు తెలుస్తోంది.
ఇటీవల టీ20 సిరీస్లో సత్తాచాటిన సూర్యకుమార్ యాదవ్ ఇంకా వన్డేల్లోకి అరంగేట్రం చేయలేదు. తొలి వన్డేలో గాయపడిన శ్రేయాస్ అయ్యర్ స్థానంలో.. రెండో వన్డేకి అతనికి అవకాశం దక్కుతుందని అంతా ఊహించారు. కానీ.. రిషబ్ పంత్కి అతని స్థానంలో కోహ్లీ చోటిచ్చాడు. దాంతో.. ఒకవేళ మూడో వన్డేలో సూర్యకుమార్ యాదవ్కి తుది జట్టులో ఛాన్స్ ఇవ్వాల్సి వస్తే..? ఎవరిపై వేటు పడనుందో తెలియాలి.
ఇటీవల టీ20 సిరీస్లో సత్తాచాటిన సూర్యకుమార్ యాదవ్ ఇంకా వన్డేల్లోకి అరంగేట్రం చేయలేదు. తొలి వన్డేలో గాయపడిన శ్రేయాస్ అయ్యర్ స్థానంలో.. రెండో వన్డేకి అతనికి అవకాశం దక్కుతుందని అంతా ఊహించారు. కానీ.. రిషబ్ పంత్కి అతని స్థానంలో కోహ్లీ చోటిచ్చాడు. దాంతో.. ఒకవేళ మూడో వన్డేలో సూర్యకుమార్ యాదవ్కి తుది జట్టులో ఛాన్స్ ఇవ్వాల్సి వస్తే..? ఎవరిపై వేటు పడనుందో తెలియాలి.