ఇంగ్లాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో వరుసగా రెండు మ్యాచ్ల్లో విఫలమైన టీమిండియా సీనియర్ ఓపెనర్ కేఎల్ రాహుల్కి మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అండగా నిలిచాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ రెండు మ్యాచ్ల్లో 1,0 పరుగులతో నిరాశపరిచిన కేఎల్ రాహుల్.. మ్యాచ్ ఫస్ట్ ఓవర్లోనే పేలవంగా వికెట్ చేజార్చుకున్నాడు. దాంతో.. మంగళవారం రాత్రి జరగనున్న మూడో టీ20 మ్యాచ్కి అతనిపై వేటు వేసి.. తొలి రెండు టీ20లకి రెస్ట్ తీసుకున్న రోహిత్ శర్మని ఆడించాలని మాజీ క్రికెటర్లు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కేఎల్ రాహుల్ని మ్యాచ్ విన్నర్గా అభివర్ణించిన ఆకాశ్ చోప్రా.. కేవలం రెండు మ్యాచ్ల్లో పేలవ ప్రదర్శన ఆధారంగా జట్టులో అతని స్థానాన్ని ప్రశ్నించడం సమంజసం కాదని హితవు పలికాడు. ఇదే పంథా కొనసాగితే.. ఈరోజు కేఎల్ రాహుల్.. రేపు ఇషాన్ కిషన్.. ఎల్లుండి రిషబ్ పంత్ జట్టులో స్థానాలు కోల్పోయి అభద్రతాభావంలోకి వెళ్లిపోతారని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ ఏడాది జనవరి నుంచి రిషబ్ పంత్ సూపర్ ఫామ్లో కొనసాగుతుండగా.. ఆదివారం రాత్రి రెండో టీ20తో భారత టీ20 జట్టులోకి అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్.. ఓపెనర్గా ఆడి మెరుపు హాఫ్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే.
వాస్తవానికి గత ఏడాది రిషబ్ పంత్ పేలవ ఫామ్ కనబర్చడంతో కేఎల్ రాహుల్.. వన్డే, టీ20ల్లో ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్గా కనిపించాడు. కానీ.. ఈ ఏడాది ఆరంభం నుంచి వరుసగా గెలిపించే ఇన్నింగ్స్లు ఆడేస్తున్న రిషబ్ పంత్.. టెస్టుల్లో వికెట్ కీపర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటు.. వన్డే, టీ20ల్లోనూ కేఎల్ రాహుల్, సంజు శాంసన్ స్థానాల్ని ప్రశ్నార్థకంగా మార్చేశాడు. ఇంగ్లాండ్తో రెండు టీ20ల్లోనూ ఓపెనర్గా రాహుల్ని ఆడించగా.. అతను విఫలమవగా.. ఇప్పుడు ఇషాన్ కిషన్ రూపంలో కొత్తగా పోటీ మొదలైంది. మిగిలిన మూడు టీ20లకి ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా ఆడే అవకాశం ఉంది.
వాస్తవానికి గత ఏడాది రిషబ్ పంత్ పేలవ ఫామ్ కనబర్చడంతో కేఎల్ రాహుల్.. వన్డే, టీ20ల్లో ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్గా కనిపించాడు. కానీ.. ఈ ఏడాది ఆరంభం నుంచి వరుసగా గెలిపించే ఇన్నింగ్స్లు ఆడేస్తున్న రిషబ్ పంత్.. టెస్టుల్లో వికెట్ కీపర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటు.. వన్డే, టీ20ల్లోనూ కేఎల్ రాహుల్, సంజు శాంసన్ స్థానాల్ని ప్రశ్నార్థకంగా మార్చేశాడు. ఇంగ్లాండ్తో రెండు టీ20ల్లోనూ ఓపెనర్గా రాహుల్ని ఆడించగా.. అతను విఫలమవగా.. ఇప్పుడు ఇషాన్ కిషన్ రూపంలో కొత్తగా పోటీ మొదలైంది. మిగిలిన మూడు టీ20లకి ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా ఆడే అవకాశం ఉంది.