యాప్నగరం

Rohit Sharma బర్మింగ్‌హామ్ టెస్టులో ఆడతాడా? కోచ్ ద్రవిడ్ ట్విస్ట్

Jasprit Bumrah భారత్ జట్టుని కెప్టెన్‌‌గా ఐదో టెస్టులో నడిపించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరగడంతో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐదో టెస్టు నుంచి ఇంకా..?

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 30 Jun 2022, 12:40 pm

ప్రధానాంశాలు:

  • భారత్, ఇంగ్లాండ్ మధ్య శుక్రవారం నుంచి టెస్టు మ్యాచ్
  • కరోనా నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని రోహిత్ శర్మ
  • జస్‌ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా టీమ్‌‌ని నడిపించబోతున్నట్లు ప్రచారం
  • ఊహించని ట్విస్ట్ ఇచ్చిన కోచ్ రాహుల్ ద్రవిడ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Rohit Sharma (Pic Credit: Getty Images)
ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న ఐదో టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆడతాడా? ఇది ఇప్పుడు ఓ మిలియన్ డాలర్ల ప్రశ్న‌గా మారిపోయింది. భారత టెస్టు టీమ్‌తో కలిసి ఇటీవల ఇంగ్లాండ్‌కి వెళ్లిన రోహిత్ శర్మ.. గత వారం అక్కడ లీసెస్టర్ టీమ్‌తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లో ఆడుతుండగా అతనికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో.. ప్రస్తుతం ఐసోలేషన్‌లో హిట్‌మ్యాన్ ఉన్నాడు.
ఇంగ్లాండ్‌తో శుక్రవారం నుంచి టెస్టు మ్యాచ్ స్టార్ట్‌కానుండటంతో బుధవారం ఉదయం రోహిత్ శర్మకి నిర్వహించిన కరోనా పరీక్షల్లో మళ్లీ పాజిటివ్‌గా వచ్చింది. దాంతో.. హిట్‌మ్యాన్ ఐదో టెస్టు నుంచి తప్పుకున్నాడని.. అతని స్థానంలో టీమ్‌ని వైస్ కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) కెప్టెన్‌ హోదాలో నడిపించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. అయితే.. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం.. ఐదో టెస్టు నుంచి రోహిత్ శర్మ‌ని ఇంకా తప్పించలేదని ట్విస్ట్ ఇచ్చాడు. మ్యాచ్‌కి ఇంకా కొన్ని గంటల సమయం ఉండటంతో.. గురువారం మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించి టెస్టు ఫలితాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాడు.

వాస్తవానికి ఐదో టెస్టులో రోహిత్ శర్మ ఆడటంపై గత వారం నుంచే సందేహాలు నెలకొన్నాయి. దాంతో.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సీనియర్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ని టెస్టు టీమ్‌‌లోకి ఎంపిక చేసిన భారత సెలెక్టర్లు హుటాహుటిన అతడ్ని ఇంగ్లాండ్‌కి పంపించారు. దాంతో.. ఒకవేళ రోహిత్ శర్మ ఐదో టెస్టులో ఆడలేకపోతే? శుభమన్ గిల్‌తో కలిసి భారత్ ఇన్నింగ్స్‌ని మయాంక్ అగర్వాల్ ప్రారంభించే అవకాశం ఉంది. గత ఏడాది ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇంగ్లాండ్‌‌కి వెళ్లిన టీమిండియా (Team India).. నాలుగు టెస్టులు ముగిసే సమయానికి 2-1తో ఆధిక్యంలో నిలిచింది. కానీ.. ఐదో టెస్టు ముంగిట భారత్ జట్టులో కరోనా కేసులు నమోదవడంతో ఆ ఐదో టెస్టుని అప్పట్లో వాయిదా వేశారు.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.