ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా వీరాభిమాని జార్వో మరోసారి వార్తల్లో నిలిచాడు. భారత్, ఇంగ్లాండ్ మధ్య కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా సోమవారం రాత్రి నాలుగో టెస్టు మ్యాచ్ ముగియగా.. ఈ మ్యాచ్లో 157 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. మైదానంలోకి వెళ్లడం ద్వారా ఈ మ్యాచ్కి శనివారం అంతరాయం కలిగించిన జార్వోని సౌత్ లండన్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఉమేశ్ యాదవ్ బౌలింగ్ చేసేందుకు సిద్ధమవుతుండగా.. టీమిండియా జెర్సీ ధరించిన జార్వో మైదానంలోకి దూసుకొచ్చి లాంగ్ రనప్తో ఓలీ పోప్కి బంతి విసిరినట్లు యాక్షన్ చేశాడు. అయితే.. ఈ క్రమంలో నాన్స్ట్రైక్ ఎండ్లోని జానీ బెయిర్స్టోని జార్వో ఢీకొనగా.. అతను కోప్పడి మైదానం వెలుపలికి వెళ్లాల్సిందిగా వార్నింగ్ ఇచ్చాడు. అంతకముందు లీడ్స్ టెస్టులోనూ మైదానంలోకి వచ్చిన జార్వోపై బెయిర్స్టో నోరుజారాడు.
ఓవల్ టెస్టు మ్యాచ్లో చివరి రోజైన సోమవారం జానీ బెయిర్స్టో (0: 4 బంతుల్లో)ని జస్ప్రీత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. అప్పుడే క్రీజులోకి వచ్చిన బెయిర్స్టోకి యార్కర్ని బుమ్రా సంధించగా.. అతని వద్ద సమాధానమే లేకపోయింది. తనని కోప్పడిన బెయిర్స్టోని డకౌట్ చేయడంతో బుమ్రాకి సోషల్ మీడియా ద్వారా జార్వో థ్యాంక్స్ చెప్పాడు. భారత్, ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా శుక్రవారం నుంచి ఐదో టెస్టు మ్యాచ్ జరగనుంది.
ఓవల్ టెస్టు మ్యాచ్లో చివరి రోజైన సోమవారం జానీ బెయిర్స్టో (0: 4 బంతుల్లో)ని జస్ప్రీత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. అప్పుడే క్రీజులోకి వచ్చిన బెయిర్స్టోకి యార్కర్ని బుమ్రా సంధించగా.. అతని వద్ద సమాధానమే లేకపోయింది. తనని కోప్పడిన బెయిర్స్టోని డకౌట్ చేయడంతో బుమ్రాకి సోషల్ మీడియా ద్వారా జార్వో థ్యాంక్స్ చెప్పాడు. భారత్, ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా శుక్రవారం నుంచి ఐదో టెస్టు మ్యాచ్ జరగనుంది.