యాప్నగరం

వైజాగ్ టెస్ట్:భారత్‌ను ఊరిస్తున్న విజయం

భారత్ మరియు ఇంగ్లండ్ జట్ల మధ్య వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి...

TNN 20 Nov 2016, 4:54 pm
భారత్ మరియు ఇంగ్లండ్ జట్ల మధ్య వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి ఒపెనర్లు హమీద్, అలిస్టర్ కుక్ వికెట్లను నష్టపోయి 87/2 స్కోర్ వద్ద నిలిచింది. క్రీజులో , రూట్ 5 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.
Samayam Telugu ind vs england 2nd test stumps for day for india upper hand
వైజాగ్ టెస్ట్:భారత్‌ను ఊరిస్తున్న విజయం


భారత జట్టు నిర్ధేశించిన 405 పరుగులు భారీ లక్ష్యంతో ఆడుతున్న ఇంగ్లండ్, మ్యాచ్‌ను డ్రా చేసే దిశగా నెమ్మదిగా వికెట్లు నష్టపోకుండా జాగ్రత్తగా ఆడింది. 50 ఓవర్ల వరకు వికెట్ నష్టపోకుండా 75 పరుగులు మాత్రమే చేసింది. ఎట్టకేలకు 50.2 ఓవర్ వద్ద భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ , ఇంగ్లండ్ ఓపెనర్ హమీద్‌ను ఎల్‌బీడబ్ల్యూగా పెవీలియన్ చేర్చాడు. 144 బంతులు అడిన హమీద్ 25 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆట ముగిసే సమయానికి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అలిస్టర్ కుక్ 54 పరుగుల ​ వ్యక్తిగత స్కోర్ వద్ద జడేజా బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. అనంతరం మరో రెండు ఓవర్ల ఆట మిగిలి ఉండగానే అంపైర్లు నాలుగో రోజు స్టంప్స్ ప్రకటించారు. దీంతో ఇంకా ఆటకు ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. భారత్ గెలవాలంటే చివరి రోజైన సోమవారం నాడు ఇంగ్లండ్ 8 వికెట్లు కూల్చాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.