యాప్నగరం

వన్డేల్లో భారత్ వైట్‌వాష్‌పై చింతేలా..?: చాహల్

మూడు దశాబ్దాల తర్వాత భారత్ జట్టు మూడు వన్డేల సిరీస్‌లో వైట్‌వాష్‌కి గురవగా.. తొలిసారి కివీస్ గడ్డపై ఈ పరాభవాన్ని ఎదుర్కోంది. కానీ.. ఈ ఓటమిని సీరియస్‌గా తీసుకోవద్దని చాహల్ సూచిస్తున్నాడు.

Samayam Telugu 11 Feb 2020, 8:42 pm
న్యూజిలాండ్ గడ్డపై వన్డేల్లో టీమిండియా వైట్‌వాష్‌‌పై తాను చింతించడం లేదని మణికట్టు స్పిన్నర్ చాహల్ వెల్లడించాడు. బే ఓవల్ వేదికగా మంగళవారం జరిగిన ఆఖరి వన్డేలో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన కివీస్ జట్టు.. మూడు వన్డేల సిరీస్‌ని 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసేసింది.
Samayam Telugu Auckland : Auckland: Indian bowler Yuzvendra Chahal bowls during a One Day Inter...


1989 తర్వాత మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా ఇలా వైట్‌వాష్‌కి గురవడం ఇదే తొలిసారి కావడంతో భారత్ అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. కానీ.. ఈ వైట్‌వాష్‌ని సీరియస్‌గా తీసుకోవద్దని చాహల్ సూచించాడు. ఇటీవల న్యూజిలాండ్‌ని ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా 5-0తో క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే.

‘భారత్ జట్టు గత 4-5ఏళ్ల ప్రదర్శనని తీసుకుంటే ఇది నాలుగో.. ఐదో సిరీస్‌ ఓటమి అనుకుంటా. న్యూజిలాండ్ టీమ్‌ కూడా మ్యాచ్ ఆడేందుకే ఇక్కడ ఉంది. కాబట్టి.. ప్రతి మ్యాచ్‌నీ టీమిండియా గెలవలేదు. అయితే.. భారత్ జట్టు టీ20 సిరీస్ గెలిచింది. మరోవైపు న్యూజిలాండ్ వన్డే సిరీస్ గెలిచింది. అందుకే.. ఈ వైట్‌వాష్‌ని మరీ అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు’ అని చాహల్ వెల్లడించాడు.

భారత్, న్యూజిలాండ్ మధ్య ఈ నెల 21 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభకానుంది. ఈ నేపథ్యంలో.. టెస్టు సిరీస్‌ గెలిచిన జట్టుదే మొత్తంగా సిరీస్‌లో ఆధిపత్యం. కాబట్టి.. టెస్టు సిరీస్ ఇంకా పోటాపోటీగా నడిచే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.