యాప్నగరం

రెండో వన్డేకి అతనిపై వేటు వేయండి: హర్భజన్

తొలి వన్డేలో కేదార్ జాదవ్‌ రూపంలో పార్ట్ టైమ్ బౌలర్ అందుబాటులో ఉన్నా.. విరాట్ కోహ్లీ అతడితో బౌలింగ్ చేయించలేదు. దీంతో.. రెండో వన్డేలో అతనిపై వేటు వేసి.. చాహల్‌ని తీసుకోవాలని భజ్జీ సూచిస్తున్నాడు.

Samayam Telugu 6 Feb 2020, 1:17 pm
న్యూజిలాండ్ పర్యటనలో తొలి పరాజయాన్ని చవిచూసిన టీమిండియా.. మళ్లీ పుంజుకోవాలని ఆశిస్తోంది. ఇటీవల కివీస్‌తో ముగిసిన ఐదు టీ20ల సిరీస్‌ని 5-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్ జట్టు.. బుధవారం హామిల్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 348 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి కారణం తుది జట్టులో చాహల్‌ లేకపోవడమేనని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌లో ఆడిన కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లలో ఏకంగా 84 పరుగులు సమర్పించుకున్న విషయం తెలిసిందే.
Samayam Telugu India, odi


Read More: కెప్టెన్ కోహ్లీ ఆవేశమే కొంపముంచుతోందా..? టీమిండియా హ్యాట్రిక్ జరిమానాలకి కారణాలివే..!

‘తొలి వన్డేలో ఇద్దరు స్పిన్నర్లు(చాహల్, కుల్దీప్‌)లను టీమిండియా ఆడించి ఉండాల్సింది. న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లు ఫాస్ట్ బౌలర్లని సమర్థంగా ఎదుర్కోగలరు. కానీ.. స్పిన్నర్లని రంగంలోకి దింపితే మాత్రం వారు కచ్చితంగా వెనకడుగు వేస్తారు. మిడిల్ ఓవర్లలో బ్యాక్ టు బ్యాక్ చాహల్, కుల్దీప్‌లతో బౌలింగ్ చేయించడం ద్వారా వికెట్లను పడగొట్టొచ్చు. కాబట్టి.. రెండో వన్డేలో కేదార్ జాదవ్‌పై వేటు వేసి.. ఇద్దరు స్పిన్నర్లని ఆడిస్తే మంచిది’ అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.

undefined

కివీస్‌తో టీ20 సిరీస్‌లో కుల్దీప్‌కి అవకాశం ఇవ్వని కెప్టెన్ విరాట్ కోహ్లీ.. చాహల్‌ని కొనసాగించాడు. తాజాగా వన్డే సిరీస్‌లో చాహల్‌ని కూర్చోబెట్టి.. కుల్దీప్‌ని ఆడిస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. ఇద్దరినీ ఆడించడం ద్వారా.. మంచి ఫలితం ఉంటుందని భజ్జీ చెప్పుకొచ్చాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య ఆక్లాండ్ వేదికగా శనివారం ఉదయం 7.30 గంటల నుంచి రెండో వన్డే జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.