భారత్, న్యూజిలాండ్ మధ్య ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా శుక్రవారం ప్రారంభంకావాల్సిన రెండో టెస్టు మ్యాచ్ ఆలస్యంగా స్టార్ట్ కాబోతోంది. ముంబయిలో బుధ, గురువారం వర్షాలు పడగా.. వాంఖడే స్టేడియంలో ఔట్ ఫీల్డ్ పచ్చిగా కనిపిస్తోంది. దాంతో.. 9 గంటలకి పడాల్సిన టాస్ కాస్త ఆలస్యంకానుంది. అయితే.. పిచ్ని మాత్రం స్టేడియం సిబ్బంది పూర్తిగా కవర్లతో కప్పి ఉంచి కాపాడారు. వాంఖడే స్టేడియం దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్లీ టెస్టు మ్యాచ్కి ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2016, డిసెంబరులో ఇక్కడ భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్టు మ్యాచ్ జరగగా.. ఆ మ్యాచ్లో టీమిండియా 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓవరాల్గా వాంఖడేలో 25 టెస్టులాడిన భారత్.. 11 మ్యాచ్ల్లో గెలిచి.. ఏడింట్లో ఓడిపోయింది. ఇక మిగిలిన ఏడు డ్రాగా ముగిశాయి.
కాన్పూర్ వేదికగా గత సోమవారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియగా.. ఈ రెండో టెస్టులో గెలిచి రెండు టెస్టుల సిరీస్ని 1-0తో చేజిక్కించుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. కాన్పూర్ టెస్టుకి దూరంగా ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్తో జట్టులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
కాన్పూర్ వేదికగా గత సోమవారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియగా.. ఈ రెండో టెస్టులో గెలిచి రెండు టెస్టుల సిరీస్ని 1-0తో చేజిక్కించుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. కాన్పూర్ టెస్టుకి దూరంగా ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్తో జట్టులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.