యాప్నగరం

IND vs NZ: టీ20ల్లో ధోనీ రికార్డ్‌కి 25 రన్స్ దూరంలో కోహ్లీ

అంతర్జాతీయ టీ20ల్లో భారత కెప్టెన్‌గా మహేంద్రసింగ్ ధోనీ నెలకొల్పిన అత్యధిక పరుగుల రికార్డ్‌‌కి విరాట్ కోహ్లీ అడుగు దూరంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగే మూడో టీ20లో ఆ రికార్డ్‌ని కోహ్లీ బ్రేక్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

Samayam Telugu 28 Jan 2020, 1:39 pm
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20ల్లో మహేంద్రసింగ్ ధోనీ నెలకొల్పిన అరుదైన రికార్డ్‌కి 25 పరుగుల దూరంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగియగా.. విరాట్ కోహ్లీ 45, 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక మూడో టీ20 మ్యాచ్ హామిల్టన్ వేదికగా బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ప్రారంభంకానుంది.
Samayam Telugu ind vs nz 3rd t20 indian captain virat kohli 25 runs shy of surpassing ms dhoni t20 record
IND vs NZ: టీ20ల్లో ధోనీ రికార్డ్‌కి 25 రన్స్ దూరంలో కోహ్లీ


హామిల్టన్ టీ20లో విరాట్ కోహ్లీ 25 పరుగులు చేయగలిగితే..? టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా రికార్డుల్లో నిలవనున్నాడు. కెప్టెన్‌గా మహేంద్రసింగ్ ధోనీ 1,112 పరుగులతో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. విరాట్ కోహ్లీ 1,088 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. దీంతో.. కోహ్లీ మరో 25 పరుగులు చేస్తే..? కెప్టెన్‌గా ధోనీ నెలకొల్పిన రికార్డ్‌ బ్రేక్‌కానుంది.

అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాని ఓసారి పరిశీలిస్తే..? దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ 1,273 పరుగులతో నెం.1 స్థానంలో ఉండగా.. ఆ తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 1,148 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి తర్వాత ధోనీ (1,112), విరాట్ కోహ్లీ (1,088) టాప్-4లో కొనసాగుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.