యాప్నగరం

చిన్న గ్రౌండ్‌లో టీమిండియాకి మ్యాచ్‌లా..?

న్యూజిలాండ్‌తో తాజాగా ముగిసిన రెండు టీ20ల్లోనూ భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ మంచినీళ్ల ప్రాయంలా సిక్సర్లు బాదేశాడు. ఎంతలా అంటే.. అతని బ్యాట్ టాప్ ఎడ్జ్ తాకిన బంతి సైతం నేరుగా వెళ్లి స్టాండ్స్‌లో పడింది.

Samayam Telugu 27 Jan 2020, 3:05 pm
భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండు టీ20 మ్యాచ్‌ల్లోనూ బ్యాట్స్‌మెన్‌లదే ఆధిపత్యంలా కనిపించింది. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా రోజు వ్యవధిలో ఈ మ్యాచ్‌లు జరగగా.. బ్యాట్స్‌మెన్‌లు అలవోకగా సిక్సర్లు బాదేశారు. దీంతో.. శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 204 పరుగుల లక్ష్యాన్ని మరో 6 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన టీమిండియా.. ఆదివారం రెండో టీ20లో 133 పరుగుల టార్గెట్‌ని 17.3 ఓవర్లోనే ఊదేసింది. గ్రౌండ్‌ చాలా చిన్నదిగా ఉండటంతో మ్యాచ్‌ల్లో మజా లేకపోయిందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతుండగా.. కామెంటేటర్ హర్షాభోగ్లే కూడా ఈ అభిప్రాయాలతో ఏకీభవించాడు.
Samayam Telugu ind vs nz 3rd t20 international cricket matches should not be played on small grounds says harsha bhogle
చిన్న గ్రౌండ్‌లో టీమిండియాకి మ్యాచ్‌లా..?


Read More: IND vs NZ 3rd T20 ముంగిట బుమ్రాకి హెచ్చరికలు పంపిన కివీస్ ఓపెనర్

‘ఈడెన్ పార్క్ చాలా చారిత్రకమైన స్టేడియమని నాకు తెలుసు. కానీ.. ఈ మధ్యకాలంలో అంతర్జాతీయ క్రికెట్ ఆడే బ్యాట్స్‌మెన్‌లు టెక్నికల్‌, ఫిట్‌నెస్ పరంగా చాలా మెరుగయ్యారు. ఈ నేపథ్యంలో.. పెద్ద పెద్ద గ్రౌండ్స్‌లోనే సిక్సర్లు కొట్టేవారికి.. ఇలాంటి చిన్న గ్రౌండ్స్‌ దొరికితే..? హిట్టింగ్‌కి స్వర్గధామమే అవుతుంది. మునుపటితో పోలిస్తే..? గ్రౌండ్‌లో మార్పులు చేశారు. కానీ.. మెరుగైన బ్యాట్స్‌మెన్‌ ప్రమాణాల ముందు అవి తేలిపోయాయి’ అని హర్షాభోగ్లే వెల్లడించాడు. ఫైన్‌లెగ్ దిశగా బౌండరీ లైన్ దూరం కేవలం 55 మీటర్లే ఉండటంతో.. తొలి టీ20లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ బ్యాట్ టాప్ ఎడ్జ్ తాకిన బంతి సిక్స్‌గా వెళ్లిపోయింది. రెండో టీ20లోనూ ఆన్‌ సైడ్‌ దిశగా రాహుల్ సింపుల్‌గా బంతిని హిట్ చేసినా.. అది బౌండరీ లైన్ వెలుపల పడటం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
Read More: కోహ్లీ ఆ క్యాచ్ వదిలేశావా..? పేలుతున్న సెటైర్లు
ఐదు టీ20ల ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు టీ20 మ్యాచ్‌లు ముగియగా.. భారత్ జట్టు 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక మూడో టీ20 మ్యాచ్ హామిల్టన్ వేదికగా బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ప్రారంభంకానుంది. న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా ఇలా బ్యాక్ టు బ్యాక్ టీ20ల్లో గెలవడం చరిత్రలో ఇదే తొలిసారి.

Read More: ప్లీజ్ ప్లీజ్ అతనెవరో చెప్పవా..! మంజ్రేకర్‌‌తో వివాదం ముగిసినట్లేనా జడేజా..?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.