యాప్నగరం

MS Dhoni సమయస్ఫూర్తి.. నీషమ్ రనౌట్

బంతి ఎక్కడికి వెళ్లిందో..? తెలుసుకునేందుకు కొన్ని క్షణాల సమయం తీసుకున్న నీషమ్.. ధోనీకి సమీపంలో బంతి ఉన్నా.. పరుగు కోసం సాహసోపేతంగా క్రీజు వెలుపలికి వెళ్లాడు. కానీ..?

Samayam Telugu 3 Feb 2019, 3:04 pm
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వికెట్ల వెనుక ఉంటే క్రీజులోని బ్యాట్స్‌మెన్ ఎంత అప్రమత్తంగా ఉండాలో..? మరోసారి క్రికెట్ ప్రపంచానికి భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదో వన్డే గుర్తు చేసింది. ఈ మ్యాచ్‌లో 253 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ జట్టు 36.1 ఓవర్లు ముగిసే సమయానికి 176/6తో నిలవగా.. క్రీజులోని బ్యాట్స్‌మెన్ జేమ్స్ నీషమ్ (44: 32 బంతుల్లో 4x4, 2x6) వరుస బౌండరీలతో మ్యాచ్‌ని భారత్‌కి దూరం చేసేలా కనిపించాడు. ఈ దశలో కేదార్ జాదవ్‌‌ని బౌలింగ్‌కి పిలిపించిన ధోనీ.. తెలివిగా నీషమ్‌ని ఔట్ చేసి మళ్లీ మ్యాచ్‌ని భారత్ చేతుల్లోకి తెచ్చాడు.
Samayam Telugu 123


ఇన్నింగ్స్ 37వ ఓవర్ వేసిన కేదార్ జాదవ్ బౌలింగ్‌లో బంతిని స్వీప్ చేసేందుకు నీషమ్ ప్రయత్నించగా.. అతడి శరీరాన్ని తాకిన బంతి ధోనీ పక్క నుంచి వికెట్లకి దూరంగా వెళ్లింది. దీంతో.. బంతి ఎక్కడికి వెళ్లిందో..? తెలుసుకునేందుకు కొన్ని క్షణాల సమయం తీసుకున్న నీషమ్.. ధోనీకి సమీపంలో బంతి ఉన్నా.. పరుగు కోసం సాహసోపేతంగా క్రీజు వెలుపలికి వెళ్లాడు. అయితే.. అప్పటికే బంతిని అందుకున్న ధోనీ.. రెప్పపాటులో దాన్ని వికెట్లపైకి విసిరాడు. ధోనీ త్రోని ఊహించలేకపోయిన.. నీషమ్.. పేలవంగా రనౌటై.. నిరాశగా పెవిలియన్‌వైపు నడిచాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.