భారత్, న్యూజిలాండ్ మధ్య సౌథాంప్టన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ చరమాంకానికి చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం నుంచి మంగళవారం వరకూ ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా శుక్రవారం, సోమవారం కనీసం ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దయ్యింది. దాంతో.. బుధవారం (రిజర్వ్ డే)లో మ్యాచ్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొనసాగించబోతోంది. కానీ.. మ్యాచ్ ఫలితం తేలడంపై సందిగ్ధత నెలకొంది. మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు మొదటి ఇన్నింగ్స్లో 217 పరుగులకి ఆలౌటవగా.. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన న్యూజిలాండ్ టీమ్ 249 పరుగులకి కుప్పకూలింది. దాంతో.. కివీస్కి 32 పరుగుల ఆధిక్యం లభించింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. మంగళవారం ఆట ముగిసే సమయానికి 64/2తో నిలిచింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (8 బ్యాటింగ్: 12 బంతుల్లో), చతేశ్వర్ పుజారా (12 బ్యాటింగ్: 55 బంతుల్లో 2x4) ఉన్నారు. ఓపెనర్లు శుభమన్ గిల్ (8: 33 బంతుల్లో), రోహిత్ శర్మ (30: 81 బంతుల్లో 2x4)లను టిమ్ సౌథీ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసేశాడు. భారత్ జట్టు ప్రస్తుతం 32 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ విజేతకి రూ.11.67 కోట్లు ప్రైజ్మనీ దక్కనుంది. అలానే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ గద కూడా ఇవ్వనున్నారు. ఇక రన్నరప్గా నిలిచిన జట్టుకి రూ.5.84 కోట్లు ఇవ్వనున్నారు. ఒకవేళ మ్యాచ్ డ్రాగా ముగిస్తే ప్రైజ్మనీని రెండు జట్లూ సమంగా పంచుకోనున్నాయి.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. మంగళవారం ఆట ముగిసే సమయానికి 64/2తో నిలిచింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (8 బ్యాటింగ్: 12 బంతుల్లో), చతేశ్వర్ పుజారా (12 బ్యాటింగ్: 55 బంతుల్లో 2x4) ఉన్నారు. ఓపెనర్లు శుభమన్ గిల్ (8: 33 బంతుల్లో), రోహిత్ శర్మ (30: 81 బంతుల్లో 2x4)లను టిమ్ సౌథీ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసేశాడు. భారత్ జట్టు ప్రస్తుతం 32 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ విజేతకి రూ.11.67 కోట్లు ప్రైజ్మనీ దక్కనుంది. అలానే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ గద కూడా ఇవ్వనున్నారు. ఇక రన్నరప్గా నిలిచిన జట్టుకి రూ.5.84 కోట్లు ఇవ్వనున్నారు. ఒకవేళ మ్యాచ్ డ్రాగా ముగిస్తే ప్రైజ్మనీని రెండు జట్లూ సమంగా పంచుకోనున్నాయి.