యాప్నగరం

భారత్‌తో నాలుగో టీ20లో కివీస్‌కి గాయం దెబ్బ

భారత్‌పై టీ20 సిరీస్‌లో నిలకడగా రాణిస్తున్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా నాలుగో టీ20కి దూరమయ్యాడు. మ్యాచ్‌కి కొన్ని నిమిషాల ముందు కివీస్ ఈ విషయాన్ని ప్రకటించింది.

Samayam Telugu 31 Jan 2020, 12:52 pm
భారత్‌తో వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం జరుగుతున్న నాలుగో టీ20లో ఆతిథ్య న్యూజిలాండ్‌కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ భుజం గాయం కారణంగా.. ఈ మ్యాచ్‌కి దూరమయ్యాడు. హామిల్టన్ వేదికగా బుధవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో బంతి కోసం డైవ్ చేసిన విలియమ్సన్ గాయపడినట్లు కివీస్ ప్రకటించింది.
Samayam Telugu ind vs nz new zealand captain kane williamson ruled out of 4th t20 against india
భారత్‌తో నాలుగో టీ20లో కివీస్‌కి గాయం దెబ్బ


Read More: undefined

వాస్తవానికి బుధవారం గాయపడిన విలియమ్సన్.. ఈరోజు మ్యాచ్‌కి ఫిట్‌నెస్ సాధిస్తాడని న్యూజిలాండ్ ఆశించింది. కానీ.. నాలుగో టీ20లో టాస్‌కి ముందు అతని గాయంతో పాటు ఫిట్‌నెస్ స్థాయిని పరిశీలించిన న్యూజిలాండ్ టీమ్ మేనేజ్‌మెంట్.. విశ్రాంతి తీసుకోవడమే మంచిదని సూచించింది. దీంతో.. కివీస్ కెప్టెన్‌గా టాస్‌కి ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ వచ్చాడు. ఆదివారం జరిగే ఐదో టీ20కి మళ్లీ విలియమ్సన్ టీమ్‌లోకి వచ్చే అవకాశముంది.
Read More: IND vs NZ 4th T20: భారత్ ఫస్ట్ బ్యాటింగ్.. ఓపెనర్‌గా రోహిత్‌కి బదులు శాంసన్

బుధవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 180 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ని విలియమ్సన్ (95: 48 బంతుల్లో 8x4, 6x6) శతక సమాన ఇన్నింగ్స్‌తో ముందుండి నడిపించాడు. కానీ.. చివరి ఓవర్‌లో అతను ఔటవగా.. రాస్ టేలర్‌ కూడా ఫెయిలవడంతో కివీస్ 179 పరుగులే చేయగలిగింది. దీంతో.. స్కోర్లు సమమవగా.. సూపర్ ఓవర్‌లోనూ విలియమ్సన్ దూకుడుగా ఆడాడు. కానీ.. రోహిత్ బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లతో కివీస్‌కి ఓటమి తప్పలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.