యాప్నగరం

Ind vs NZ 1st ODI: వన్డేల్లో శిఖర్ ధావన్ అరుదైన రికార్డ్..!

వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 5 వేల పరుగుల మార్క్‌ని అందుకున్న క్రికెటర్ల జాబితాలో దక్షిణాఫ్రికా ఓపెనర్ హసీమ్ ఆమ్లా అగ్రస్థానంలో ఉన్నాడు.

Samayam Telugu 23 Jan 2019, 12:57 pm
భారత ఓపెనర్ శిఖర్ ధావన్ ఈరోజు వన్డే కెరీర్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. నేపియర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో దూకుడుగా ఆడిన శిఖర్ ధావన్ (37: 42 బంతుల్లో 6x4) వన్డేల్లో వేగంగా 5వేల పరుగుల మార్క్‌ని అందుకున్న రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం 114 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకోగా.. అతని తర్వాత ధావన్ 118 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. మొత్తంగా వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 5వేల పరుగులు చేసిన ఐదో క్రికెటర్‌గా ధావన్ నిలిచాడు.
Samayam Telugu Sydney : Indias Shikhar Dhawan hits the ball for four runs while batting agains...


వన్డే క్రికెట్‌లో వేగంగా 5 వేల పరుగుల మార్క్‌ని అందుకున్న క్రికెటర్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే..! దక్షిణాఫ్రికా ఓపెనర్ హసీమ్ ఆమ్లా 2015లో కేవలం 101 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ మైలురాయిని అందుకుని అగ్రస్థానంలో ఉండగా.. తర్వాత స్థానంలో వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ (114 ఇన్నింగ్స్‌లు), విరాట్ కోహ్లీ (114), బ్రియాన్ లారా (118), శిఖర్ ధావన్ (118) టాప్-5లో కొనసాగుతున్నారు.

5 వేల పరుగుల మార్క్‌ని చేరుకునేందుకు శిఖర్ ధావన్‌కి 8 ఏళ్ల 95 రోజుల సమయం పట్టగా.. అందరి కంటే వేగంగా కేవలం 5ఏళ్ల 95 రోజుల్లోనే విరాట్ కోహ్లీ 2013లో ఆ ఘనత సాధించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.