యాప్నగరం

టీమిండియాలోకి ఎంట్రీ నా కల: సైనీ

బుమ్రా తరహాలో వేగంతో పాటు కచ్చితత్వంతో బౌలింగ్ చేసే నవదీప్ సైనీకి వరుస అవకాశాలివ్వాలని టీమిండియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఈ నెల 21న భారత్ టెస్టు జట్టులోకి ఈ యువ పేసర్ ఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Samayam Telugu 17 Feb 2020, 6:13 pm
‘‘భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడాలనేది నా కల’’.. అది నెరవేరడంతో చాలా సంతోషంగా ఉందని ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ వెల్లడించాడు. గత ఏడాది నుంచి టీమిండియాలో అవకాశాలు దక్కించుకుంటున్న ఈ 27ఏళ్ల ఫాస్ట్ బౌలర్ ఇప్పటికే ఐదు వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లాడి 18 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్‌తో ఈ నెల 21 నుంచి ప్రారంభంకానున్న రెండు టెస్టుల సిరీస్‌లోనూ ఈ పేసర్‌కి అవకాశం దక్కింది.
Samayam Telugu Navdeep Saini T20


Read More: తప్పిదాలని ఐపీఎల్‌లో దిద్దుకుంటా: ఠాకూర్

భారత టెస్టు జట్టులో ఇప్పటికే ఫాస్ట్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ రూపంలో నలుగురు ఉన్నారు. దీంతో.. నవదీప్ సైనీకి తుది జట్టులో అవకాశం దక్కడం అనుమానంగానే కనిపిస్తోంది. కానీ.. ఇటీవల గాయం నుంచి కోలుకుని మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన ఇషాంత్ శర్మ.. పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్‌తో కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో.. సైనీని ఆడించే అవకాశాలూ లేకపోలేదు. అదే జరిగితే.. టెస్టుల్లో అరంగేట్రానికి మార్గం సుగుమంకానుంది.

‘భారత టెస్టు జట్టులోకి ఎంపికవడం చాలా ఆనందంగా ఉంది. టీమిండియాకి ఆడాలనేది ప్రతి క్రికెటర్ కల. ఒకప్పుడు నా కల కూడా ఇదే. ఇప్పుడు ఆ కల పూర్తిగా నెరవేరినట్లయింది. జట్టులో చోటు దక్కించుకోవడమే కాదు.. దాన్ని నిలబెట్టుకునేందుకు శ్రమిస్తాను’ అని నవదీప్ సైనీ వెల్లడించాడు.

Read More: IPL 2020లో KKRకి మరో ఆండ్రీ రసెల్..?

వన్డే, టీ20ల్లో ఇప్పటికే గంటకి 140-150కి.మీ వేగంతో బంతుల్ని సంధిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న నవదీప్ సైనీ.. జస్‌ప్రీత్ బుమ్రా తరహాలో యార్కర్లనూ విసురుతున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే మ్యాచ్‌లో బౌలింగ్‌తో పాటు ఈ పేసర్ బ్యాటింగ్‌లోనూ హిట్టర్ తరహాలో అదరగొట్టేశాడు. దీంతో.. ఇకపై టీమిండియా మేనేజ్‌మెంట్ రెగ్యులర్‌గా అతడ్ని ఆడించే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.