భారత్, న్యూజిలాండ్ మధ్య సౌథాంప్టన్ వేదికగా బుధవారం ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఉత్కంఠగా సాగుతున్న దశలో.. వికెట్ కీపర్ రిషబ్ పంత్ సడన్గా మైదానం వెలుపలికి వెళ్లిపోయాడు. మ్యాచ్లో 139 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ జట్టుని కెప్టెన్ కేన్ విలియమ్సన్ (52 నాటౌట్: 89 బంతుల్లో 8x4), రాస్ టేలర్ (47 నాటౌట్: 100 బంతుల్లో 6x4) గెలిపించేందుకు పట్టుదలతో ఆడుతున్న సమయంలో.. టీమిండియా సడన్గా వికెట్ కీపర్ని మార్చడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రిషబ్ పంత్ స్థానంలో సీనియర్ వికెట్ కీపర్ సాహా వచ్చి ఓ నాలుగు ఓవర్లు కీపింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో ఆఖరికి న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫైనల్లో ఇన్నింగ్స్ 26వ ఓవర్ నుంచి 30వ ఓవర్ వరకూ సాహా కీపింగ్ చేశాడు. దాంతో.. రిషబ్ పంత్కి ఏమైంది..? ఎందుకు సాహా కీపింగ్ చేస్తున్నాడు..? అని నెటిజన్లు తెగ శోధించారు. ఎట్టకేలకి రిషబ్ పంత్ అలా గ్రౌండ్ వెలుపలికి వెళ్లడానికి గల కారణం వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్లో రిషబ్ పంత్ కెప్టెన్గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ ఆ కారణాన్ని వెల్లడించింది.
‘‘రిషబ్ పంత్ ఒంట్లో నలతగా ఉండటంతో.. ఫైనల్లో కాసేపు సాహా వికెట్ కీపింగ్ చేశాడు’’ అని ఢిల్లీ క్యాపిటల్స్ వెల్లడించింది. ఈ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 పరుగులు చేసిన రిషబ్ పంత్.. సెకండ్ ఇన్నింగ్స్లో 41 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.
‘‘రిషబ్ పంత్ ఒంట్లో నలతగా ఉండటంతో.. ఫైనల్లో కాసేపు సాహా వికెట్ కీపింగ్ చేశాడు’’ అని ఢిల్లీ క్యాపిటల్స్ వెల్లడించింది. ఈ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 పరుగులు చేసిన రిషబ్ పంత్.. సెకండ్ ఇన్నింగ్స్లో 41 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.