యాప్నగరం

WTC Finalకి ఈరోజు కూడా వర్షం ముప్పు.. డ్రా తప్పదా..?

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ సజావుగా జరిగే సూచనలు కనిపించడం లేదు. ఇప్పటికే నాలుగు రోజులకిగానూ రెండు రోజుల ఆట వర్షం కారణంగా రద్దయింది. ఇక మిగిలిన రెండు రోజులు.. రిజర్వ్ డేతో కలుపుకుని

Samayam Telugu 22 Jun 2021, 9:58 am

ప్రధానాంశాలు:

  • సౌథాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్
  • నాలుగు రోజులకిగానూ రెండు రోజులు ఆట వర్షార్ఫణం
  • మంగళవారం కూడా వర్షం పడే సూచనలు
  • మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu WTC Final (Pic Credit: Reuters)
భారత్, న్యూజిలాండ్ మధ్య సౌథాంప్టన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే శుక్రవారం, సోమవారం ఆట మొత్తం తుడిచిపెట్టుకుపోగా.. శనివారం, ఆదివారం కలిపి 141.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత జట్టు 92.1 ఓవర్లు బ్యాటింగ్ చేసి 217 పరుగులకి ఆలౌటవగా.. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆడుతున్న న్యూజిలాండ్ 49 ఓవర్లలో 101/2తో కొనసాగుతోంది. న్యూజిలాండ్ ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 116 పరుగులు వెనకబడి ఉంది.
మ్యాచ్‌లో ఇంకా రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది. అది కూడా రిజర్వ్ డే (బుధవారం)తో కలుపుకుని. దాంతో.. మ్యాచ్ ఫలితం లేలడంపై సందిగ్ధత నెలకొంది. సౌథాంప్టన్ స్టేడియం పరిసరాల్లో ఈరోజు ఉదయం, మధ్యాహ్నం 3-4 గంటల మధ్య వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. దాంతో.. మంగళవారం కూడా ఆటకి అంతరాయం తప్పేలా లేదు. అలానే బుధవారం కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ విజేతకి రూ.11.67 కోట్లు ప్రైజ్‌మనీ దక్కనుంది. అలానే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ గద కూడా ఇవ్వనున్నారు. ఇక రన్నరప్‌గా నిలిచిన జట్టుకి రూ.5.84 కోట్లు ఇవ్వనున్నారు. ఒకవేళ మ్యాచ్ డ్రాగా ముగిస్తే ప్రైజ్‌మనీని రెండు జట్లూ సమంగా పంచుకోనున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.