యాప్నగరం

ధావన్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్

సఫారీ గడ్డపై అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్న భారత ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీతో కదం తొక్కాడు. 33వ ఓవర్‌లో మోరీస్ విసిరిన తొలి బంతినే బౌండరీ లైన్ ధాటించిన ధావన్ 99 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.

TNN 10 Feb 2018, 7:16 pm
సఫారీ గడ్డపై అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్న భారత ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీతో కదం తొక్కాడు. 33వ ఓవర్‌లో మోరీస్ విసిరిన తొలి బంతినే బౌండరీ లైన్ ధాటించిన ధావన్ 99 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో ధావన్‌కు ఇది 13వ శతకం. కోహ్లీ ఔటైన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రహానే కూడా బ్యాట్ ఝుళిపిస్తుండటంతో టీమిండియా స్కోరు బోర్డు పరుగులు పెడుతోంది. ఇదే రన్ రేట్‌ కొనసాగితే సునాయాసంగా 300 పైచిలుకు పరుగులు చేసే అవకాశం ఉంది. కానీ, వరుణిడి రూపంలో టీమిండియా జోరుకు అడ్డుకట్ట పడింది.
Samayam Telugu ind vs sa 4th odi shikhar dhawan century leads india 200 for 2
ధావన్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్


దట్టమైన మేఘాలు కమ్ముకొని, వెలుతురు మందగించడంతో ఎంపైర్లు ఆట నిలిపేశారు. ఆట నిలిచిపోయే సమయానికి భారత జట్టు 34.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 107 (102 బంతుల్లో, 10×4, 2×6) రహానే 5 (8 బంతుల్లో, 1×4) పరుగులతో క్రీజులో ఉన్నారు. సారథి విరాట్ కోహ్లీ 75 (83 బంతుల్లో, 7×4, 1×6) పరుగులు చేసి మోరీస్ బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.