యాప్నగరం

భారత్‌తో టీ20 సిరీస్‌కి శ్రీలంక జట్టు ప్రకటన

భారత్‌తో ఈ నెల 5 నుంచి ప్రారంభంకానున్న మూడు టీ20ల సిరీస్‌ కోసం 16 మందితో కూడిన జట్టుని శ్రీలంక ఈరోజు ప్రకటించింది. జట్టు కెప్టెన్‌గా ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ ఎంపికవగా.. దాదాపు 16 నెలల తర్వాత మళ్లీ టీ20 జట్టులోకి ఆల్‌రౌండర్ ఏంజిలో మాథ్యూస్ సెలక్ట్ అయ్యాడు. గత ఏడాది చివర్లో పాకిస్థాన్ గడ్డపై పర్యటించిన శ్రీలంక జట్టు.. మూడు టీ20ల సిరీస్‌ని 3-0తో చేజిక్కించుకుంది. దీంతో.. అదే జోరుని భారత్ గడ్డపైనా కొనసాగించాలని లంకేయులు ఉవ్విళ్లూరున్నారు.

Samayam Telugu 1 Jan 2020, 4:42 pm
భారత్‌తో ఈ నెల 5 నుంచి ప్రారంభంకానున్న మూడు టీ20ల సిరీస్‌ కోసం 16 మందితో కూడిన జట్టుని శ్రీలంక ఈరోజు ప్రకటించింది. జట్టు కెప్టెన్‌గా ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ ఎంపికవగా.. దాదాపు 16 నెలల తర్వాత మళ్లీ టీ20 జట్టులోకి ఆల్‌రౌండర్ ఏంజిలో మాథ్యూస్ సెలక్ట్ అయ్యాడు. గత ఏడాది చివర్లో పాకిస్థాన్ గడ్డపై పర్యటించిన శ్రీలంక జట్టు.. మూడు టీ20ల సిరీస్‌ని 3-0తో చేజిక్కించుకుంది. దీంతో.. అదే జోరుని భారత్ గడ్డపైనా కొనసాగించాలని లంకేయులు ఉవ్విళ్లూరున్నారు.
Samayam Telugu ind vs sl 2020 sri lanka announce t20 squad for india series
భారత్‌తో టీ20 సిరీస్‌కి శ్రీలంక జట్టు ప్రకటన



Twitter-WATCH: National Team commences work for the year 2...

మాథ్యూస్ రాకతో శ్రీలంక జట్టులో సమతూకం

భారత్ పిచ్‌లపై లసిత్ మలింగాకి మంచి అవగాహన ఉండగా.. మాథ్యూస్, మెండిస్, ఇసుర ఉదాన తదితర సీనియర్ క్రికెటర్లు కూడా టీమ్‌లో ఉండటంతో శ్రీలంక మంచి సమతూకంగా కనిపిస్తోంది. ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన మూడు టీ20ల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకున్న టీమిండియా మెరుగైన ఫామ్‌లో ఉన్నప్పటికీ బౌలింగ్ బలహీనత ఆ సిరీస్‌లో కాస్త కంగారుపెట్టించింది. కానీ.. గాయం నుంచి కోలుకుని జస్‌ప్రీత్ బుమ్రా టీమ్‌లోకి పునరాగమనం చేయడంతో సిరీస్‌లో భారత్ జట్టు కూడా హాట్ ఫేవరెట్‌గానే బరిలోకి దిగుతోంది.


శ్రీలంక టీ20 జట్టు: లసిత్ మలింగ (కెప్టెన్), కుశాల్ పెరీరా, దనుశ్ గుణతిలక, అవిష్కా ఫెర్నాండో, భనుక రాజపక్సె, ఒసాడ ఫెర్నాండో, దసున్ శనక, ఏంజిలో మాథ్యూస్, నిరోషన్ డిక్వెల్లా, కుశాల్ మెండిస్, హసనరంగ, లక్ష్యన్ సందకన్, ధనంజయ డిసెల్వా, లాహిరు కుమార, ఇసురు ఉదాన

భారత్ జట్టులోకి బుమ్రా రీఎంట్రీ.. షెడ్యూల్, టీమ్ ఇదే

తొలి టీ20 మ్యాచ్‌ జనవరి 5న గౌహతి వేదికగా జరగనుండగా.. రెండో టీ20 7న ఇండోర్ వేదికగా, ఆఖరి టీ20 మ్యాచ్ పుణె వేదికగా 10న జరగబోతోంది. అన్ని మ్యాచ్‌లు భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమవుతాయి.

భారత టీ20 జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), మనీశ్ పాండే, సంజు శాంసన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, చాహల్, కుల్దీప్ యాదవ్, శార్ధూల్ ఠాకూర్, నవదీప్ షైనీ, జస్‌ప్రీత్ బుమ్రా

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.