శ్రీలంక చేతిలో రెండో టీ20లో భారత్ జట్టు ఓటమికి గల కారణాన్ని కెప్టెన్ శిఖర్ ధావన్ వెల్లడించాడు. కొలంబో వేదికగా బుధవారం రాత్రి ముగిసిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలి ఉండగానే శ్రీలంక 133/6తో ఛేదించేసింది. దాంతో.. మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమవగా.. ఆఖరి టీ20 మ్యాచ్ గురువారం రాత్రి కొలంబో వేదికగానే జరగనుంది. భారత్ ఓటమి తర్వాత కెప్టెన్ శిఖర్ ధావన్ మాట్లాడుతూ ‘‘టీమ్లో ఒక బ్యాట్స్మెన్ తక్కువగా ఉన్నాడని మాకు తెలుసు. అయినప్పటికీ.. చక్కగా ఇన్నింగ్స్ని నిర్మించాం. కానీ.. ఓ 10-15 పరుగులు తక్కువ చేశాం. అదే మ్యాచ్ని మాకు దూరం చేసింది. కుర్రాళ్లని చూసి నేను చాలా గర్వపడుతున్నా. చివరి వరకూ వాళ్లు పట్టు వదల్లేదు. దాంతో.. మ్యాచ్ని ఆఖరి ఓవర్ వరకూ తీసుకెళ్లగలిగాం’’ అని శిఖర్ ధావన్ వెల్లడించాడు.
కృనాల్ పాండ్యాకి మంగళవారం కరోనా పాజిటివ్గా తేలడంతో.. అతనితో క్లోజ్ కాంటాక్ట్లో ఉన్న ఆటగాళ్లు పృథ్వీ షా, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్ తదితరులు ఐసోలేషన్కి పరిమితమయ్యారు. దాంతో.. రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్, నితీశ్ రాణా రూపంలో కేవలం ఐదుగురు ప్రొఫెషనల్ బ్యాట్స్మెన్లతో భారత్ మ్యాచ్ ఆడింది.
కృనాల్ పాండ్యాకి మంగళవారం కరోనా పాజిటివ్గా తేలడంతో.. అతనితో క్లోజ్ కాంటాక్ట్లో ఉన్న ఆటగాళ్లు పృథ్వీ షా, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్ తదితరులు ఐసోలేషన్కి పరిమితమయ్యారు. దాంతో.. రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్, నితీశ్ రాణా రూపంలో కేవలం ఐదుగురు ప్రొఫెషనల్ బ్యాట్స్మెన్లతో భారత్ మ్యాచ్ ఆడింది.