యాప్నగరం

వెస్టిండీస్‌ టీమ్‌కి భారీ జరిమానా.. అదే తప్పిదం

రిషబ్ పంత్ ఒక సిక్స్ కొట్టగానే.. బౌలర్ వద్దకి వెళ్లిపోయిన పొలార్డ్ పెద్ద ఎత్తున చర్చలు జరిపాడు. అలానే శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ చేసే సమయంలోనూ తరచూ ఫీల్డింగ్ మార్పులతో విండీస్ కెప్టెన్‌గా బిజీగా కనిపించాడు. దాని ఫలితం మ్యాచ్ అయితే గెలిచారు. కానీ.. భారీగా జరిమానా పడింది.

Samayam Telugu 16 Dec 2019, 6:30 pm
భారత్‌తో చెపాక్ వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో గెలిచి మంచి జోష్‌మీదున్న వెస్టిండీస్‌కి ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు‌లోని ఆటగాళ్లందరి మ్యాచ్ ఫీజులోనూ 80 శాతం జరిమానా విధిస్తూ మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఇప్పుడు తొలి వన్డేలో గెలిచిన ఆనందం విండీస్‌ టీమ్‌లో ఆవిరైపోయినట్లు తెలుస్తోంది.
Samayam Telugu Chennai: West Indies players celebrate the dismissal of Indian batsman Rishabh P...
West Indies players


Read More: వైజాగ్‌‌కి చేరుకున్న భారత్, విండీస్ క్రికెటర్లు

చెపాక్ వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండీస్ టీమ్.. టీమిండియాని తొలుత బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీని కూడా తొందరగానే పెవిలియన్‌కి పంపడంలో సఫలమైన వెస్టిండీస్ బౌలర్లు.. రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌ హాఫ్ సెంచరీలు బాదడంతో కాస్త ఒత్తిడికి గురయ్యారు. దీంతో.. కెప్టెన్ కీరన్ పొలార్డ్ తరచూ బౌలర్ల వద్దకి వెళ్లి చర్చలు జరపడం, ఓవర్ మధ్యలో ఫీల్డింగ్‌ మార్పులు చేస్తూ మ్యాచ్ సమయాన్ని ఎక్కువగా వృథా చేశాడు. దీంతో.. స్లో ఓవర్ తప్పిదం కింద మ్యాచ్ రిఫరీ జరిమానా విధించారు.

Read More: ఇదెక్కడి వింత..? జడేజా రనౌట్‌పై కోహ్లీ ఆగ్రహం
మ్యాచ్‌లో కేటాయించిన సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే 4 ఓవర్లు వెస్టిండీస్ తక్కువగా వేయడంతో టీమ్‌లోని ఆటగాళ్లందరి మ్యాచ్ ఫీజులో 80 శాతం జరిమానా విధించారు. సాధారణంగా ఒక ఓవర్ తక్కువగా వేస్తే.. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కనిష్టంగా 10 శాతం, గరిష్టంగా 20 శాతం, కెప్టెన్ మ్యాచ్ ఫీజులో రెట్టింపు అంటే 20 లేదా 40 శాతం జరిమానాగా విధిస్తారు. తాజాగా చెపాక్ వన్డేలో విండీస్ టీమ్ ఏకంగా 4 ఓవర్లు తక్కువగా వేయడంతో జరిమానా కూడా భారీగా పడింది. ఇక భారత్, వెస్టిండీస్ మధ్య బుధవారం విశాఖపట్నం వేదికగా రెండో వన్డే జరగనుంది.

Read More: చెపాక్ వన్డేలో భారత్ ఓటమికి 5 కారణాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.