భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో సెల్ఫీ దిగేందుకు మరో అభిమాని భద్రతా వలయాన్ని దాటుకుని మైదానంలోకి దూసుకెళ్లాడు. వెస్టిండీస్తో హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఈరోజు రెండో టెస్టు మొదలవగా.. తొలి సెషన్లో ఓ అభిమాని అకస్మాత్తుగా బారికేడ్ల పైనుంచి మైదానంలోకి దూకి ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీని సమీపించాడు. దీంతో.. కంగారుపడిన అంపైర్లు ఆటని నిలిపివేయగా.. కోహ్లీ దగ్గరికి వెళ్లిన అతను కౌగలించుకుని సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. అయితే.. సెల్ఫీ తీసుకునేందుకు అభిమానికి సహకరించిన కోహ్లీ.. హగ్కి మాత్రం అనుమతించలేదు. అప్పటికే అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది బలవంతంగా అభిమానిని మైదానం వెలుపలికి తీసుకెళ్లారు.
రాజ్కోట్ వేదికగా గత శనివారం ముగిసిన తొలి టెస్టులోనూ ఇదే తరహాలో ఇద్దరు అభిమానులు భద్రతా వలయాన్ని దాటుకుని కోహ్లీతో సెల్ఫీ దిగారు. బ్యాటింగ్ చేస్తుండగా.. ఆ ఇద్దరూ రావడంతో.. తొలుత వారిని వారించిన కోహ్లి.. ఆ తర్వాత సెల్ఫీ దిగేందుకు అంగీకరించాడు. అయితే.. ఈ రెండు ఘటనలూ అంతర్జాతీయ క్రికెటర్ల భద్రతలోని డొల్లతనాన్ని ప్రస్ఫుటం చేశాయి.
రాజ్కోట్ వేదికగా గత శనివారం ముగిసిన తొలి టెస్టులోనూ ఇదే తరహాలో ఇద్దరు అభిమానులు భద్రతా వలయాన్ని దాటుకుని కోహ్లీతో సెల్ఫీ దిగారు. బ్యాటింగ్ చేస్తుండగా.. ఆ ఇద్దరూ రావడంతో.. తొలుత వారిని వారించిన కోహ్లి.. ఆ తర్వాత సెల్ఫీ దిగేందుకు అంగీకరించాడు. అయితే.. ఈ రెండు ఘటనలూ అంతర్జాతీయ క్రికెటర్ల భద్రతలోని డొల్లతనాన్ని ప్రస్ఫుటం చేశాయి.