యాప్నగరం

మ్యాచ్‌ మధ్యలో కోహ్లీతో సెల్ఫీకి ఫ్యాన్ సాహసం

సెల్ఫీ తీసుకునేందుకు అభిమానికి సహకరించిన కోహ్లీ.. హగ్‌కి మాత్రం అనుమతించలేదు. అప్పటికే అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది బలవంతంగా అభిమానిని మైదానం వెలుపలికి తీసుకెళ్లారు.

Samayam Telugu 12 Oct 2018, 12:57 pm
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ‌తో సెల్ఫీ దిగేందుకు మరో అభిమాని భద్రతా వలయాన్ని దాటుకుని మైదానంలోకి దూసుకెళ్లాడు. వెస్టిండీస్‌తో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈరోజు రెండో టెస్టు మొదలవగా.. తొలి సెషన్‌లో ఓ అభిమాని అకస్మాత్తుగా బారికేడ్ల పైనుంచి మైదానంలోకి దూకి ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీని సమీపించాడు. దీంతో.. కంగారుపడిన అంపైర్లు ఆటని నిలిపివేయగా.. కోహ్లీ దగ్గరికి వెళ్లిన అతను కౌగలించుకుని సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. అయితే.. సెల్ఫీ తీసుకునేందుకు అభిమానికి సహకరించిన కోహ్లీ.. హగ్‌కి మాత్రం అనుమతించలేదు. అప్పటికే అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది బలవంతంగా అభిమానిని మైదానం వెలుపలికి తీసుకెళ్లారు.
Samayam Telugu ind vs wi 2nd test another fan breaks security cordon for selfie with virat kohli
మ్యాచ్‌ మధ్యలో కోహ్లీతో సెల్ఫీకి ఫ్యాన్ సాహసం


రాజ్‌కోట్ వేదికగా గత శనివారం ముగిసిన తొలి టెస్టులోనూ ఇదే తరహాలో ఇద్దరు అభిమానులు భద్రతా వలయాన్ని దాటుకుని కోహ్లీతో సెల్ఫీ దిగారు. బ్యాటింగ్ చేస్తుండగా.. ఆ ఇద్దరూ రావడంతో.. తొలుత వారిని వారించిన కోహ్లి.. ఆ తర్వాత సెల్ఫీ‌ దిగేందుకు అంగీకరించాడు. అయితే.. ఈ రెండు ఘటనలూ అంతర్జాతీయ క్రికెటర్ల భద్రత‌లోని డొల్లతనాన్ని ప్రస్ఫుటం చేశాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.