Ind Vs Wi 3rd Odi: India’s Predicted Playing Xi For Cuttack Odi
విండీస్తో కటక్ వన్డేకి భారత్ జట్టులో రెండు మార్పులు..?
వెస్టిండీస్తో ఆదివారం కటక్ వేదికగా జరగనున్న ఆఖరి వన్డేకి భారత్ తుది జట్టులో రెండు మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మూడు వన్డేల సిరీస్ ఇప్పటికే 1-1తో సమమవగా.. విజేత నిర్ణయాత్మక ఆఖరి వన్డే కావడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ రిస్క్ తీసుకోకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. సమతూకంగా తుది జట్టుని ఎంచుకోవాలని ఆశిస్తున్న కోహ్లీ.. కటక్లో రాత్రి 7 గంటల నుంచి మంచు ప్రభావం ఎక్కువగా ఉండనుండటంతో సీనియర్ బౌలర్లకి ఛాన్స్ ఇవ్వాలని యోచిస్తున్నాడట.
Samayam Telugu22 Dec 2019, 8:59 am
వెస్టిండీస్తో ఆదివారం కటక్ వేదికగా జరగనున్న ఆఖరి వన్డేకి భారత్ తుది జట్టులో రెండు మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మూడు వన్డేల సిరీస్ ఇప్పటికే 1-1తో సమమవగా.. విజేత నిర్ణయాత్మక ఆఖరి వన్డే కావడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ రిస్క్ తీసుకోకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. సమతూకంగా తుది జట్టుని ఎంచుకోవాలని ఆశిస్తున్న కోహ్లీ.. కటక్లో రాత్రి 7 గంటల నుంచి మంచు ప్రభావం ఎక్కువగా ఉండనుండటంతో సీనియర్ బౌలర్లకి ఛాన్స్ ఇవ్వాలని యోచిస్తున్నాడట.
కేదార్ జాదవ్పై వేటు తప్పదా..?
వైజాగ్ వన్డేలో గాయపడిన ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ జట్టుకి దూరమవగా.. అతని స్థానంలో యువ ఫాస్ట్ బౌలర్ నవదీప్ షైనీని టీమ్లోకి తీసుకున్నారు. కానీ.. ఈ పేసర్కి తుది జట్టులో చోటు దక్కడం అనుమానంగానే కనిపిస్తోంది. అలానే ఆల్రౌండర్ కేదార్ జాదవ్పైనా వేటు పడే సూచనలు కనిపిస్తున్నాయి. తొలి రెండు వన్డేల్లోనూ బ్యాటింగ్, బౌలింగ్లోనూ కేదార్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. ఒకవేళ కేదార్ జాదవ్పై వేటు పడితే..? మిడిలార్డర్లో మనీశ్ పాండేకి ఛాన్స్ దక్కనుంది.
కటక్లో మంచు.. చాహల్కి ఛాన్సిస్తారా..?
గాయపడిన దీపక్ చాహర్కి బదులుగా కటక్ వన్డే తుది జట్టులోకి స్పిన్నర్ చాహల్ని తీసుకునే విషయాన్ని టీమిండియా మేనేజ్మెంట్ చర్చిస్తోంది. అప్పుడు చాహల్తో పాటు కుల్దీప్ యాదవ్, రవీండ్ర జడేజా రూపంలో ముగ్గురు ప్రొఫెషనల్ స్పిన్నర్లు తుది జట్టులో ఉంటారు. ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, శార్ధూల్ ఠాకూర్ని అలానే కొనసాగించే అవకాశం ఉంది. చెపాక్ వన్డేలో నలుగురు ప్రొఫెషనల్ బౌలర్లలో బరిలోకి దిగి మూల్యం చెల్లించుకున్న టీమిండియా.. వైజాగ్ వన్డేలో ఐదుగురితో ఆడి 107 పరుగులతో గెలుపొందిన విషయం తెలిసిందే.
మిడిలార్డర్లో పంత్, శ్రేయాస్ జోడీ.. హిట్
భారత్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో పెద్దగా మార్పులు జరిగే సూచనలు కనిపించడం లేదు. వైజాగ్ వన్డేలో శతకాలు బాదిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్.. మరోసారి భారత్ ఇన్నింగ్స్ని ఆరంభించనుండగా.. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్రానున్నారు. ఇక ఆరో స్థానంలో మనీశ్ పాండే, ఏడులో జడేజా బ్యాటింగ్కి వస్తాడు. కటక్ పిచ్ బ్యాటింగ్కి పూర్తిగా అనుకూలం అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో.. టీమిండియా కంగారంతా ఇప్పుడు బౌలింగ్ గురించే. ఒకప్పుడు జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ టీమ్ బౌలింగ్ భారాన్నీ సమర్థంగా మోశారు. కానీ.. ఇప్పుడు నమ్మదగిన పేసర్ టీమ్లో లేకుండాపోయాడు.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.