యాప్నగరం

బ్యాట్‌తో ఆదుకున్న అశ్విన్, జడేజా

మొహాలీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.

TNN 28 Nov 2016, 12:24 pm
మొహాలీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 204 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన భారత్‌ను అశ్విన్ (72), జడేజా (70 నాటౌట్) జోడి ఆదుకుంది. మిడిలార్డర్ విఫలమైనప్పటికీ ఈ ఇద్దరు ఆల్‌రౌండర్లు అద్భుతంగా ఆడటంతో లంచ్ విరామానికి భారత్ 7 వికెట్ల నష్టానికి 354 పరుగులు చేసింది.
Samayam Telugu inda vs england 3rd test mohali india 354 for 7 at lunch
బ్యాట్‌తో ఆదుకున్న అశ్విన్, జడేజా


అశ్విన్, జడేజా జోడి ఏడో వికెట్‌కు 97 పరుగుల విలవైన భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. 271/6 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ఆరంభించిన భారత్ మరో 30 పరుగులు జోడించి ఏడో వికెట్‌ను కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న అశ్విన్‌ను స్టోక్స్ బోల్తా కొట్టించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జయంత్ యాదవ్ (29 నాటౌట్).. జడేజాకు మంచి సహకారాన్ని అందించాడు. దీంతో జడేజా కూడా అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. లంచ్ విరామానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 71 పరుగుల ఆధిక్యంలో ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.