యాప్నగరం

రాణించిన నవ త్రయం.. అదరగొట్టిన భారత్-ఏ

ఇంగ్లాండ్ గడ్డ మీద భారత కుర్రాళ్లు అదరగొట్టారు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్-ఏ జట్టు 125 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Samayam Telugu 18 Jun 2018, 11:58 am
ఇంగ్లాండ్ గడ్డ మీద భారత కుర్రాళ్లు అదరగొట్టారు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్-ఏ జట్టు 125 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, పృథ్వీ షా, ఇషాన్ కిషన్ అర్ధ సెంచరీలు సాధించిన వేళ.. ఇండియా-ఏ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. అయ్యర్ (54), కిషన్ (50) రెండో వికెట్‌కు 99 పరుగులు జోడించి వరుస బంతుల్లో అవుటయ్యారు. అనంతరం పృథ్వీ షా 61 బంతుల్లో 70 పరుగులతో రాణించాడు.
Samayam Telugu ind A


భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ ఎలెవెన్ 36.5 ఓవర్లలో 203 పరుగులకే కుప్పకూలింది. పేసర్ దీపక్ చహర్ 48 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

ఈ విజయంతో ఇంగ్లాండ్ లయన్స్, వెస్టిండీస్-ఏ జట్లతో శుక్రవారం ప్రారంభం కానున్న త్రైపాక్షిక వన్డే సిరీస్‌లో భారత్-ఏ జట్టు ఉత్సాహంగా అడుగుపెట్టనుంది. ఇండియా-ఏ జట్టు వెస్టిండీస్-ఏతో రెండు, ఇంగ్లాండ్ లయన్స్‌తో ఒకటి చొప్పున అనధికారిక టెస్టులు ఆడనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.