యాప్నగరం

సింగిల్ రన్‌తో సిరీస్ చేజారింది..!

ఆఖరి ఓవర్లో భారత విజయానికి 7 పరుగులు కావాలి. భారత్ 264/8తో నిలిచింది. అయితే క్రీజులో ఉన్న ఇషాన్ కిషన్ తప్పిదంతో మ్యాచ్‌తోపాటు వన్డే సిరీస్‌ను భారత్-ఎ.. కివీస్‌కు కోల్పోయింది.

Samayam Telugu 26 Jan 2020, 1:16 pm
భారత్-ఎతో జరిగిన మూడువన్డేల సిరీస్‌ను 2-1తో న్యూజిలాండ్-ఎ కైవసం చేసుకుంది. ఆదివారం క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన నిర్ణయాత్మక మూడోవన్డేలో ఐదుపరుగులతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి ఏడు పరుగులు అవసరమయ్యాయి. అప్పటికే క్రీజులో ఇషాన్ కిషన్ (84 బంతుల్లో 71 నాటౌట్, 8 ఫోర్లు) లాంటి సెట్ బ్యాట్స్‌మన్ ఉండటంతో భారత్‌దే విజయమనుకున్నారు. అయితే అక్కడే ట్విస్ట్ జరిగింది.
Samayam Telugu ishan kishan
ishan kishan (file)


కైలీ జేమిసన్ వేసిన ఆ ఓవర్ తొలి బంతిని కిషన్ వృథా చేశాడు. రెండో బంతికి సింగిల్ తీశాడు. ఇదే పొరపాటుగా మారింది. తర్వాతి రెండు బంతులకు సందీప్ వారియర్, ఇషాన్ పొరెల్‌లను డకౌట్లుగా జేమిసన్‌ను పెవిలియన్‌కు పంపడంతో భారత ఇన్నింగ్స్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ముగిసింది.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 270 పరుగులు చేసింది. మార్క్ చాప్‌మన్ (98 బంతుల్లో110 నాటౌట్, 10 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ సెంచరీతో జట్టుకు పోరాడగలిగే స్కోరు అందించాడు. 105/6తో నిలిచిన జట్టును టాడ్ ఆస్టిల్‌(56)తో కలిసి ఆదుకున్నాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 136 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో ఇషాన్‌కు మూడు, రాహుల్ చాహర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో భారత్ 49.4 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. ఇషాన్ టాప్ స్కోరర్. పృథ్వీ షా (55), రుతురాజ్ గైక్వాడ్ (44) రాణించినా ఫలితం లేకపోయింది. అక్షర్ పటేల్ (32) చివర్లో కాస్త వేగంగా ఆడాడు. జేమీసన్‌కు నాలుగు, అజాజ్ పటేల్‌కు మూడు వికెట్లు దక్కాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.