యాప్నగరం

ఆసీస్‌తో ఆటాడుకున్న శ్రేయస్ అయ్యర్

పచ్చికతో ఉన్న పిచ్ మీద వార్మప్ మ్యాచ్‌లో తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించాలనుకున్న ఆసీస్‌కు శ్రేయస్ అయ్యర్ రూపంలో షాక్ తగిలింది.

TNN 19 Feb 2017, 1:42 pm
ముంబై: పచ్చికతో ఉన్న పిచ్ మీద వార్మప్ మ్యాచ్‌లో తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించాలనుకున్న ఆసీస్‌కు శ్రేయస్ అయ్యర్ రూపంలో షాక్ తగిలింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత్ - ఎ జట్టు ఆటగాడు శ్రేయస్ అయ్యర్ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమైనా.. శ్రేయస్ మాత్రం ఆసీస్ బౌలర్లతో ఆటాడుకున్నాడు. 210 బంతుల్లోనే 202 పరుగులతో శ్రేయస్ నాటౌట్‌గా నిలవడంతో భారత్-ఎ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 403 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 176/4 ఓవర్ నైట్ స్కోరు‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ 'ఎ' జట్టు తొలి సెషన్‌లోనే రిషబ్ పంత్(21) వికెట్ కోల్పోయింది. ఇషాన్ కిషన్(4) కూడా వెంటనే అవుట్ కావడంతో కష్టాల్లో పడింది. ఈ దశలో.. గౌతమ్ (74)తో కలిసి అయ్యర్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ మ్యాచ్‌లో అయ్యర్ 27 ఫోర్లు, 7 సిక్సర్లు బాదడం విశేషం.
Samayam Telugu india a vs australia warm up match sheryas ayyar double ton india a gives strong relpy
ఆసీస్‌తో ఆటాడుకున్న శ్రేయస్ అయ్యర్


అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 469 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆ జట్టులో కెప్టెన్ స్టీవ్ స్మిత్, షాన్ మార్ష్ సెంచరీలు చేయగా.. హ్యాండ్స్ కాంబ్, వేడ్ అర్ధ సెంచరీలతో రాణించారు. భారత్ ‘ఎ’ తరఫున శ్రేయస్ అయ్యర్ రాణించడంతో.. మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగియనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.